India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని విద్యార్థినులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఉచితంగా నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిజామాబాద్ RBVRRస్కూల్లో శిబిరం ఉంటుందన్నారు. దీనికి 9,10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఇందులో సెల్ఫ్ డిఫెన్స్, మోటివేషన్ సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై పోలీస్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామ శివారులో అర్ధరాత్రి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఆకతాయిల పనేనని గ్రామస్థులు భావిస్తున్నారు. శివలింగం ప్రత్యక్షమైన స్థలం కొంత వివాదంలో ఉన్నట్లు తెలిసింది.!
సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్తో SRH మ్యాచ్ను చూడటం ఆనందంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆ మ్యాచులో అభిషేక్శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఎంతో మందికి గుర్తుండిపోతుందన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు మేయర్తో పాటు కే.కేశవరావు వచ్చారు.
వర్షాలకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనతో ఉన్న GHMC వాతావరణ శాఖ, TGDPSలతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. వర్షాకాలంలో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు.
సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన కృషి వెలకట్టలేనిది. దాదాపు కోటిన్నర మొక్కలు నాటారు రామయ్య-జానకమ్మ దంపతులు. ఆయన పర్యావరణ సేవలకు గాను 3వేల ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు వరించాయి. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్యకు నివాళి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడమే.. ఏమంటారు?..
వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి 163 భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో సంగెం, పర్వతగిరి, గీసుకొండ, నెక్కొండ మండలాల్లోని గ్రామాల్లో 38. 20 కిలో మీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఈనెల చివరి వరకు పొడిగించాలని జిల్లాలోని యువకులు కోరుతున్నారు. చాలామంది వివిధ కారణాలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తోంది. చాలామంది యువకులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలను తీసుకోలేకపోయారు. ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు.
KNR జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.3°C నమోదు కాగా, మానకొండూర్ 42.3, గంగాధర 42.1, రామడుగు 41.9, తిమ్మాపూర్ 41.6, KNR 41.5, చొప్పదండి 41.4, చిగురుమామిడి 41.2, KNR రూరల్ 41.0, శంకరపట్నం, గన్నేరువరం 40.9, కొత్తపల్లి 40.5, వీణవంక 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్, ఇల్లందకుంట 39.6°C గా నమోదైంది. కాగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
Sorry, no posts matched your criteria.