Telangana

News July 13, 2024

HYD: ఆగస్టు 6న ఛలో పార్లమెంట్: ఆర్.కృష్ణయ్య 

image

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న ఛలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలోనే బీసీలకు అన్యాయం జరుగుతోందని, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలను అణచి వేయడం లేదని, పేరుకే ప్రజాస్వామ్యం అని, ఆచరణలో మచ్చుకైనా లేదన్నారు.

News July 13, 2024

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

image

మిర్యాలగూడ నెల్లిమెట్ల జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ధనుంజనాయుడు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టానే. చింతపల్లివైపు నుంచి వస్తున్న కారును చూసి అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో కారులో 140కేజీల గంజాయి బయటపడింది. విలువ సుమారు రూ. 35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు అరుణ్, రేంజు, ఆనంద్, కొర్ర అర్జున్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

News July 13, 2024

ఆదిలాబాద్: DOST రిపోర్టింగ్‌కు మరొ అవకాశం

image

డిగ్రీ కళాశాలలో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. DOST ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పొడగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT

News July 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. మహబూబ్ నగర్ జిల్లా కొత్త మోల్గారాలు 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 39.3 మి.మీ, వనపర్తి జిల్లా విలియంకొండ 36.8 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 31.3 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 13, 2024

NZB: రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరి మృత దేహాలు లభ్యం

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను గుర్తించారు. వారు గుర్తు తెలియని రైలు నుంచి పడి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతల వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

MDK: వాళ్లు BRSలోనే ఉంటారా..? జోరుగా చర్చ..!

image

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 9 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఉమ్మడి మెదక్‌లో KCR, హరీశ్‌రావు సహా మరో ముగ్గురు BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మరికొందరు MLAలు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ శ్రేణులు అంటుండడంతో ఆ ముగ్గురిలో ఎవరైనా చేరుతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనిపై మీ కామెంట్?

News July 13, 2024

హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్ రేట్

image

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ ‌గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023‌‌లో 47, 2024లో 45
మర్డర్‌ అటెంప్ట్‌లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్‌ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

News July 13, 2024

MBNR: మాది ప్రజల పార్టీ: MLA

image

మాది ప్రజల పార్టీ అని, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కాంగ్రెస్ నేత, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం గుండాలలో అంబ రామలింగేశ్వర స్వామి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. AICC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, నాయకులు బాలాజీ సింగ్, భూపతిరెడ్డి, సందీప్ రెడ్డి, ఆశాదీప్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News July 13, 2024

హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్ రేట్

image

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ ‌గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023‌‌లో 47, 2024లో 45
మర్డర్‌ అటెంప్ట్‌లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్‌ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

News July 13, 2024

NLG: ఉమ్మడి జిల్లాకు త్వరలో కొత్త బస్సులు!

image

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో త్వరలో కొత్త మార్గాలకు 30 బస్సులు, పాత మార్గాల్లో అదనంగా మరో 30 బస్సులతో పాటు నల్గొండ, సూర్యాపేట పరిధిలో మరో 50 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 640 బస్సులు ఉండగా.. నిత్యం 2.50 లక్షల KM తిరుగుతూ సుమారు రూ.150కోట్ల ఆదాయం వస్తుంది.