India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వేలో ఈ సీజన్లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపినట్లు వెళ్లడైంది. క్షేత్రస్థాయిలో విస్తీర్ణ అధికారుల నుంచి ఏవోలు, ఏడీఏలు, డీఏవో వరకు లక్ష్యాలు నిర్దేశించుకొని చేపట్టిన సర్వేతో సాగు విస్తీర్ణం నిర్ధారణ చేశారు. జిల్లాలో 3,34,606 ఎకరాల సాగు భూమిలో అధిక శాతం 2,73,400 ఎకరాల్లో వరిసాగు చేపట్టినట్లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయాలైన వారిని మొదటగా దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్లోని గాంధీనగర్లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. కాలనీలో శుక్రవారం ఆరుగురిపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.
శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.
నవాబ్పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సూక పల్లికాయ(పాతది) ధర రూ.6వేలు పలకగా, సూక పల్లికాయ(పచ్చిది) రూ.5,780, పచ్చి పల్లికాయ రూ.4, 600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపుకి రూ.11,859 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని MBNR ఎంపీ అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.
విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి వేణుగోపాలస్వామి నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ వేణుగోపాలస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు విశ్రాంత ఉద్యోగులు పోలీసు సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ అఫ్జల్, జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి, జీవన్, జహింగీర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.