Telangana

News September 20, 2024

BREAKING.. వరంగల్ రైల్వే స్టేషన్లో NO STOP

image

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 39 రైళ్లకు SEP 25 నుంచి 28 వరకు నో స్టాప్ వర్తిస్తుందని HYD సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్, విజయవాడ-వరంగల్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు ట్రైన్లకు కాజీపేట ఆల్టర్నేటివ్ స్టాప్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు.

News September 20, 2024

వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి: అదనపు ఎస్పీ

image

MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.

News September 20, 2024

MDK: నోటి మాట.. ఆ గ్రామం ఆదర్శం..!

image

నోటి మాటతో కట్టుబడి ఆ గ్రామస్థులందరూ కలిసి మద్యపానాన్ని నిషేధించి నేటికి 10 ఏళ్ల పైనే అవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ్డలో గ్రామస్థులు గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యపానం విక్రయించడం నేరంగా భావించి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి విక్రయాలు జరుపకూడదనే నిబంధనను మౌఖికంగానే విధించుకున్నారు. దీంతో మద్యపానం విక్రయించకుండా గూడెంగడ్డ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.

News September 20, 2024

నిర్మల్ : సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలరోజుల ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు.

News September 20, 2024

కామారెడ్డి: మెగా అదాలత్‌ను వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 28 జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సింధుశర్మ అన్నారు. రాజీపడ దగిన కేసులలో జిల్లాలోని అన్ని కోర్టులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారించుకోవచ్చని ఆమె సూచించారు.

News September 20, 2024

నిజామాబాద్: పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు మేలు: సీపీ

image

నిరంతరం వార్తలు రాసే పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడే వీలుంటుందని సీపీ కల్మేశ్వర్ అన్నారు. నిజామాబాద్‌లో నూతన న్యాయ చట్టాలపై శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లో లోకి తీసుకోవద్దని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. వీడీసీల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 20, 2024

KNR: ఇక ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.

News September 20, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలివే…

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దేవరకద్రలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 36.2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మొగలమట్కాలో 35.8 డిగ్రీలు, గద్వాల జిల్లా వెంకటాపూర్ లో 35.7 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెద్దమందడిలో 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 20, 2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానం: ‘X’లో KTR

image

వరంగల్ <<14142693>>MGMలో అంబులెన్స్<<>> అందుబాటులో లేకపోవడం అమానుషమని మాజీ మంత్రి KTR అన్నారు. గురువారం జ్వరంతో మృతి చెందిన గీతిక(6)ను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంపై ఆయన ‘X’లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అవమానం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులుగా మార్చడమే గాక.. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్, CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని మండిపడ్డారు.

News September 20, 2024

HYD: రేపే లాస్ట్.. CITDలో పోస్ట్ డిప్లొమా కోర్సులు!

image

HYD బాలానగర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CIT)లో పోస్ట్ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. CITD అడ్మిషన్ డెస్క్ వద్ద శనివారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.citdindia.org సందర్శించండి.