India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ శంకరపట్నం మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ ఓదెల మండలంలో పట్టాలు దాటుతుండగా రైలు తగిలి యువకుడికి గాయాలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. @ జగిత్యాల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీ. @ ఈవీఎం గోదాములను పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్. @ మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్.
✓బల్కంపేట: దద్దరిల్లిన ఎల్లమ్మ తల్లి ఊరేగింపు
✓షాద్ నగర్లో వ్యక్తి దారుణ హత్య
✓HYD: సచివాలయం వద్ద విలేఖరుల నిరసన
✓దుండిగల్: మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
✓గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలని నిరసన
✓అమీర్పేట: మెట్రోలో ప్రయాణించిన ఎండి NVS రెడ్డి
✓పోచారం: ప్రాణం తీసిన బెట్టింగ్
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. వారికి అందిన సమాచారం మేకు దాడులు నిర్వహించి పేకాటాడుతున్న వారి వద్ద 5 సెల్ఫోన్లు, 11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు సీఐ పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.
తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.
మెదక్ ఎస్పీ డా.బి. బాలస్వామి బదిలీ అయ్యారు. బాలస్వామి జనవరి 6న మెదక్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. తాజాగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఈస్ట్ జోన్, హైదరాబాద్కు బదిలీ చేస్తు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మెదక్ నూతన ఎస్పీగా డి. ఉదయ్కుమార్ రెడ్డిని నియమించారు. మెదక్లో ఇటీవల జరిగిన అల్లర్లే ఎస్పీ డాక్టర్ బాలస్వామి బదిలీకి కారణంగా జిల్లాలో చర్చనీయాంశమైంది.
✒టీచర్గా మారిన నారాయణపేట కలెక్టర్
✒బిజినేపల్లి:కుక్క కోసం గొడవ.. సోదరుడు ఆత్మహత్య
✒ఢిల్లీ బోనాల వేడుకల్లో ఒగ్గు కళాకారులు.. అభినందించిన గవర్నర్
✒షాద్నగర్లో వ్యక్తి దారుణ హత్య
✒ఉమ్మడి జిల్లాలో మొహర్రం.. పలుచోట్ల ప్రత్యేక పూజలు
✒TGPSC గ్రూప్-1కు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
✒ఈశ్వరమ్మ ఘటనలో నిందితులకు శిక్ష పడేలా చూస్తాం:ST,SC కమిషనర్
✒వన మహోత్సవంపై ప్రత్యేక ఫోకస్
రూ.100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి.. సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
షాద్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్కు చెందిన స్ధిరాస్తి వ్యాపారి కమ్మరి కృష్ణను షాద్నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫామ్ హౌస్లో దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అహ్మదీ బజార్లో ఉన్న ఉర్దూ ఘర్లో గ్రూప్ -2, గ్రూప్ -3 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వరంగల్ రేంజ్ ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2016లో పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీగా, అనంతరం సంగారెడ్డి ఎస్పీగా చేశారు. 2019లో DIG ర్యాంక్ పదోన్నతి పొందారు. 2021 నుంచి రామగుండం సీపీగా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.