India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దేవరకద్రలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 36.2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మొగలమట్కాలో 35.8 డిగ్రీలు, గద్వాల జిల్లా వెంకటాపూర్ లో 35.7 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెద్దమందడిలో 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వరంగల్ <<14142693>>MGMలో అంబులెన్స్<<>> అందుబాటులో లేకపోవడం అమానుషమని మాజీ మంత్రి KTR అన్నారు. గురువారం జ్వరంతో మృతి చెందిన గీతిక(6)ను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంపై ఆయన ‘X’లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అవమానం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులుగా మార్చడమే గాక.. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్, CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని మండిపడ్డారు.
HYD బాలానగర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CIT)లో పోస్ట్ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. CITD అడ్మిషన్ డెస్క్ వద్ద శనివారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.citdindia.org సందర్శించండి.
నోటి మాటతో కట్టుబడి ఆ గ్రామస్థులందరూ కలిసి మద్యపానాన్ని నిషేధించి నేటికి 10 ఏళ్ల పైనే అవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ్డలో గ్రామస్థులు గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యపానం విక్రయించడం నేరంగా భావించి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి విక్రయాలు జరుపకూడదనే నిబంధనను మౌఖికంగానే విధించుకున్నారు. దీంతో మద్యపానం విక్రయించకుండా గూడెంగడ్డ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.
ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు, అడపా దడపా మంత్రుల రివ్యూలతో ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంజీఎంలో పదికి పైగా ఫిర్యాదుల పెట్టేలను ఏర్పాటు చేశారు. వాటిని కలెక్టర్ స్వయంగా తెరిచి సమస్యలు తెలుసుకోనున్నారు. ఓపీ కౌంటర్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన BRS సీనియర్ నాయకుడు నాగరాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్య కారణంతో శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రేగోడు తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ రమాదేవి తహశీల్దార్ ఆఫీస్ను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో ఎమ్మార్వో అందుబాటులో లేరు. దీంతో అక్కడికి వచ్చిన రైతులతో ఆర్డీఓ మాట్లాడారు. తహశీల్దార్ నిత్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు తెలిపారు. దీంతో తహశీల్దార్ని సస్పెండ్ చేశామని ఆర్డీవో తెలిపారు.
Sorry, no posts matched your criteria.