India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు దక్కినట్లు తెలిపారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులు దక్కినట్లు చెప్పారు. వరుసగా ఆరోసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు దక్కినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.
లింగంపేటలోని నాగన్న మెట్ల బావిని నేడు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కాగా ఈ బావికి చాలా ప్రత్యేకతలున్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి 18 వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫియత్తులో లిఖించబడింది. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతు వరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మరీ ఇలాంటి పురాతన బావులు మీ గ్రామంలో ఉన్నాయా.. ఉంటే కామెంట్ చేయండి
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘కళా మహోత్సవ్’ మొదటి ఎడిషన్ను ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సందర్శకులు https://visit.rashtrapatibhavan. gov.in వెబ్సైట్లో స్లాట్ను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.