India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమాన్ శోభాయాత్రకు ADBలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 300మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక సీసీ టీవీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ర్యాలీ పూర్తయ్యేంతవరకు హనుమాన్ విగ్రహానికి ఇరువైపులా పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అదేవిధంగా ర్యాలీ జరుగు ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సూచించారు.
KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్బండ్ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్బండ్ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ నిన్న సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. నరేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు 6వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి అర్సపల్లి బైపాస్ రోడ్డు వద్ద అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శనివారం మధిర డిపోను తనిఖీ చేశారు. డిపోలో ఉన్న బస్సుల మెయింటెనెన్స్ విభాగంలో మెకానిక్స్, ఆపరేషన్స్ విభాగంలో డ్రైవర్స్, కండక్టర్లతో మాట్లాడారు. తీవ్ర ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మధిర డిపోలో పనిచేస్తున్న సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DM శంకర్ రావు, ట్రాఫిక్&గ్యారేజ్ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.
నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.