India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యాపారం కోసం తల్లిని డబ్బులు అడగగా.. తన వద్ద లేవని చెప్పడంతో మనస్తాపానికి గురైన కొడుకు తన ఫోన్ స్టేటస్లో ‘ఇది నా చివరి రోజు’ అని పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మిర్జాలగూడలో నివాసముండే లలిత కుమార్ వాసు(25) టిఫిన్ బండి పెట్టుకోవడానికి రూ.5 లక్షలు కావాలని తల్లిని అడిగాడు. ఇవ్వక పోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని శాలిగౌరారం ఎస్సై వాస ప్రవీణ్పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు తీసుకున్నారు. వీ. ఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని.. నివేదిక వచ్చాక చర్యలుండలున్నట్లు తెలుస్తోంది. శాలిగౌరారం నూతన ఎస్సైగా సైదులును నియమించారు.
జిల్లా కేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్తో పాటు ఏఎస్ఎన్ గార్డెన్ సోమవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ఏఎస్ఎన్ గార్డెన్లో సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి జిల్లాలో సీత్లా పండుగ
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
చేపల వేటకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పల్లికొండ నరసయ్య చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాళ్లకు, చేతులకు వల చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HYD నాగోల్ పరిధి సాయి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్ (35) కొంతకాలంగా హైబీపీతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం అతడు ఉండే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డోర్ తెరిచి చూడగా.. నరేశ్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తీవ్ర వర్షాభావంతో నాగార్జునసాగర్ వట్టి పోయింది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే సాగర్ అడుగంటుతోంది. ప్రమాదకరస్థాయిలో డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ను మోగిస్తోంది. దీంతో సాగర్, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి NLG, KMM జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నిండుకుంటుంది.
HYD నాగోల్ పరిధి సాయి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్ (35) కొంతకాలంగా హైబీపీతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం అతడు ఉండే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డోర్ తెరిచి చూడగా.. నరేశ్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరంపై రిపోర్ట్ను కమిషన్కు కాగ్(CAG) అందజేసింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. సోమవారం 14 మంది పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించిన కమిషన్.. ఈనెల 16లోపు కమిషన్కు నివేదించిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దుబ్బాక మండలంలో జరిగింది. SI గంగరాజ్ వివరాలు.. అచ్చుమాయిపల్లికి చెందిన సోమారపు లింగం పొలానికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
Sorry, no posts matched your criteria.