Telangana

News April 12, 2025

మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయ్..

image

మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న పాపన్నపేట, మెదక్‌లో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణం శాఖ అధికారులు వెల్లడించారు. హవేలిఘనపూర్ 40.8, టేక్మాల్ 40.6, వెల్దుర్తి 40.1, కుల్చారం 39.9, నిజాంపేట్, చేగుంట 39.7, కౌడిపల్లి 39.6, రామయంపేట్ 39.4, నర్సాపూర్ 39.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 12, 2025

MBNR: ఆ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో చిన్నచింతకుంటలో 39.7 డిగ్రీలు, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.6 డిగ్రీలు, నవాబుపేటలో 39.5 డిగ్రీలు, కోయిలకొండ (M) సిరివెంకటాపూర్‌లో 39.4 డిగ్రీలు, మిడ్జిల్ 39.3 డిగ్రీలు, కోయిలకొండ (M) పారుపల్లిలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

News April 12, 2025

REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

image

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట బైక్‌పై రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. ప్రమాదం చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు నిరాకరించడంతోపాటు బదులుగా 100 మొక్కలు నాటాలని అతనికి సూచించారు. రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని క్షమించి మొక్కలు నాటమని కోరడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే రామయ్యకు పర్యావరణం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. 

News April 12, 2025

వనజీవి రామయ్య కుటుంబ ప్రస్థానమిదే..

image

ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య తన 15వ ఏట కొణిజర్ల(M) తుమ్మలపల్లికి చెందిన జనమ్మను వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు సైదులు ఏడాది క్రితం గుండెపోటుతో మరణించగా, 2వ కుమారుడు సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. చిన్న కుమారుడు కనకయ్య రెడ్డిపల్లిలోనే దుకాణం నిర్వహిస్తున్నారు. 

News April 12, 2025

కామారెడ్డి: కల్తీ కల్లు ఘటన.. సీఎం సమీక్ష..?

image

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష జరిపి వరుస కల్తీ ఘటనలపై ఆరా తీయనున్నారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరుకానున్నారు. దామరంచ, అంకోల్, దుర్కి, సంగెం మండలాల్లో 69మంది, గౌరారంలో 30 మంది కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురుని అరెస్టు చేశారు. 27మందిపై కేసు నమోదుచేశారు.

News April 12, 2025

దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటు: హరీశ్ రావు

image

ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటుని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారాని, పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం Xలో పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News April 12, 2025

ఖమ్మంకు సీఎం రేవంత్ ..?

image

ఖమ్మం రూరల్ రెడ్డిపల్లిలో రేపు వనజీవి రామయ్య అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా వనజీవి రామయ్యకి నివాళులు అర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

News April 12, 2025

కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

image

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. KNRభగత్‌నగర్‌కు చెందిన మెహర్‌తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్‌లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.

News April 12, 2025

భగ్గుమంటున్న కరీంనగర్

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.

News April 12, 2025

వనజీవి రామయ్య మృతి ధరిత్రికి తీరని లోటు: తుమ్మల

image

చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య మరణం ధరిత్రికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు.

error: Content is protected !!