Telangana

News September 20, 2024

మహబూబ్‌నగర్: తండ్రిని చంపేశాడు..!

image

ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.

News September 20, 2024

KMR: ఇలాంటి పురాతన బావులు మీ ఊరిలో ఉన్నాయా.. కామెంట్..!

image

లింగంపేటలోని నాగన్న మెట్ల బావిని నేడు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కాగా ఈ బావికి చాలా ప్రత్యేకతలున్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి 18 వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫియత్తులో లిఖించబడింది. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతు వరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మరీ ఇలాంటి పురాతన బావులు మీ గ్రామంలో ఉన్నాయా.. ఉంటే కామెంట్ చేయండి

News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన విషయం విదితమే. గతంలో సోనియా గాంధీ పట్ల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించడం మర్యాదకు సంబంధించిన అంశం అన్నారు. మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

MBNR: మధ్యాహ్న భోజన బిల్లులు రూ.1.94 కోట్లు విడుదల

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.

News September 20, 2024

28న రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’

image

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘కళా మహోత్సవ్’ మొదటి ఎడిషన్ను ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సందర్శకులు https://visit.rashtrapatibhavan. gov.in వెబ్సైట్లో స్లాట్ను రిజర్వ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

News September 20, 2024

MBNR: ఆశావహులతో స్థానిక ఎన్నికలు దోబూచులు

image

పాలమూరు జిల్లా ఆశావహులతో స్థానిక సంస్థల ఎన్నికలు దోబూచులాడుతున్నాయి. ఫిబ్రవరి 2024తో గత పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. సుమారు 9 నెలలు కావస్తున్నా సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలపై స్పష్టత రాలేదు. కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికలు జరుపుతామని సీఎం ప్రకటించారు. దీంతో మరో 4 నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని, వనపర్తి జిల్లా 255 పంచాయతీల్లో పోటీ చేసే ఆశావాహులంటున్నారు.

News September 20, 2024

సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 20, 2024

NZB: డాక్టర్ పేరిట GGHలో రూ.90 వేల నూతన ఫోన్ అపహరణ

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో డాక్టర్ పేరిట రూ.90 వేలు విలువ చేసే కొత్త ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. నగరంలోని ఒక సెల్ ఫోన్ షాపుకు డాక్టర్ పేరిట ఫోన్ చేసి GGHకు ఫోన్ తెస్తే తీసుకుంటానని నమ్మబలికి రప్పించి సూపరింటెండెంట్ రూం ఎదురుగా కూర్చోబెట్టాడు. లోపల సార్‌కు ఫోన్ చూయించి వస్తానని ఫోన్‌తో సహా పరారయ్యాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 20, 2024

సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.