India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన కోయిలకొండ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. బూరుగుపల్లికి చెందిన గొల్ల మోగులయ్య, లక్ష్మయ్య గ్రామం నుంచి మహబూబ్నగర్కు వెళ్తుండగా పారుపల్లి వద్ద RTC బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో RTC బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD కీసరలో బాలిక(14)పై <<13578768>>బహదూర్పుర వాసి మహేశ్(25)<<>> అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాత్ రూమ్కు వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి వెతికాడు. DCMలో అచేతన స్థితిలో ఉన్న కూతురిని చూసిన తండ్రి విలపిస్తూ వెళ్లి మహేశ్ను పట్టుకునేందుకు యత్నించగా అతడు వ్యాన్తో సహా పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
HYD కీసరలో బాలిక(14)పై <<13578768>>బహదూర్పుర వాసి మహేశ్(25)<<>> అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాత్ రూమ్కు వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి వెతికాడు. DCMలో అచేతన స్థితిలో ఉన్న కూతురిని చూసిన తండ్రి విలపిస్తూ వెళ్లి మహేశ్ను పట్టుకునేందుకు యత్నించగా అతడు వ్యాన్తో సహా పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఇంద్రవెల్లి మండలంలోని దొడంద గ్రామానికి చెందిన పంద్రా బండు(16) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని వెతికినా ఫలితం దక్కలేదు. కాగా ఆదివారం ఉదయం పంద్రా.. స్థానికులకు బావిలో శవమై కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు.
HYD గోల్కొండలో జగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు బోనాల నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు జాతర నేపథ్యంలో భక్తులు మరింత పోటెత్తుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈనెల 21, 22న సికింద్రాబాద్ మహంకాళి, 28, 29 తేదీల్లో పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
HYD గోల్కొండలో జగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు బోనాల నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు జాతర నేపథ్యంలో భక్తులు మరింత పోటెత్తుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈనెల 21, 22న సికింద్రాబాద్ మహంకాళి, 28, 29 తేదీల్లో పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. రెండవ రోజు 280 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 231మంది హాజరై సర్టిఫికెట్ వేరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు
HYD గోల్కొండ కోట వద్ద గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో జులై 27వ తేదీన నిర్వహించనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 11వ కల్లు ఘట్టం సాక బోనం పండుగ పోస్టర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, భిక్షపతి గౌడ్, నరసింహ గౌడ్, మానస గౌడ్, మహేందర్ గౌడ్, బొమ్మెన రాజు గౌడ్, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
HYD గోల్కొండ కోట వద్ద గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో జులై 27వ తేదీన నిర్వహించనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 11వ కల్లు ఘట్టం సాక బోనం పండుగ పోస్టర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, భిక్షపతి గౌడ్, నరసింహ గౌడ్, మానస గౌడ్, మహేందర్ గౌడ్, బొమ్మెన రాజు గౌడ్, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని.. అందుకోసం తాను తప్పకుండా కృషి చేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతానన్నారు. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా పంపలేదన్నారు .
Sorry, no posts matched your criteria.