India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ విశ్రాంత ఉద్యోగికి మీ పై కేసు ఉందని బెదిరించి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు దోచేసిన ఘటన HYD పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. GMR ఎన్క్లేవ్లో ఉంటున్న విశ్రాంత ODF ఉద్యోగి శ్రీనివాస్కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పారు. సామాజిక వ్యతిరేక విషయాలను ప్రచారం చేసినందుకు మీపై చెంబూరు PSలో కేసు నమోదైందని బెదిరించి డబ్బు కొట్టేయగా అతడు PSను ఆశ్రయించాడు.
ఓ విశ్రాంత ఉద్యోగికి మీ పై కేసు ఉందని బెదిరించి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు దోచేసిన ఘటన HYD పటాన్చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. GMR ఎన్క్లేవ్లో ఉంటున్న విశ్రాంత ODF ఉద్యోగి శ్రీనివాస్కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పారు. సామాజిక వ్యతిరేక విషయాలను ప్రచారం చేసినందుకు మీపై చెంబూరు PSలో కేసు నమోదైందని బెదిరించి డబ్బు కొట్టేయగా అతడు PSను ఆశ్రయించాడు.
పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఏకాదశి ముందు పెద్ద పట్నాలు, అగ్నిగుండ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.
HYDలో భారీగా బంగారాన్ని DRI అధికారులు ఈరోజు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోల్కత్తా నుంచి బస్సులో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన DRI అధికారులు, నిందితులను విచారిస్తున్నారు.
HYDలో భారీగా బంగారాన్ని DRI అధికారులు ఈరోజు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోల్కత్తా నుంచి బస్సులో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన DRI అధికారులు, నిందితులను విచారిస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరమ్మ కాలనీలోని ఒక బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గుర్తతెలియని వ్యక్తులు కొట్టి బావిలో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో అరికెల రమేశ్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన రమేశ్ పక్కనున్న గుడిసెలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుడిసెలో ఉరేసుకున్నట్లు ఉన్నప్పటికీ మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుద్ఘాతంతో రైతు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ఉద్ది శంకరయ్య పొలం దగ్గరికి వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల మహోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకొని సందడి చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి మండలం దత్తాయపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, పెద్ద తండా మాజీ సర్పంచ్ కుమారుడు రాజు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్లో చేరామని దేవేందర్, రాజు నాయక్ అన్నారు.
Sorry, no posts matched your criteria.