India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న HMDA అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.
HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేశవరావుతో కాంగ్రెస్ రాజీనామా చేయించిందని, మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన MLA, MLCలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
పోలీస్ సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గద్వాల ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నేర, న్యాయచట్టాలు 2023 ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నూతన చట్టాల ద్వారా అవకాశం కలిగిందన్నారు. ఇకపై నూతన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 8న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి పరిష్కరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, జీపీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. GP ఆవరణతో పాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి గుంటూరు ఒంగోలు సూపర్ లగ్జరీ, లహరి సర్వీసులకు ఒకేసారి పోనురాను టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10శాతం రాయితీ పొందవచ్చని RTC డిపో మేనేజర్ కల్పన తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం RTC ప్రయాణ ప్రాంగణంలో రిజర్వేషన్ కౌంటర్లో లేదా
www.tsrtconline.in బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని RTC లో సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం చేయాలని కోరారు.
ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ సమక్షంలో మంత్రులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.