Telangana

News April 12, 2025

పెద్దపల్లి: బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. అరెస్టు

image

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు.

News April 12, 2025

తెలంగాణలో టాప్‌ 3లో ఉమ్మడి ADB

image

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News April 12, 2025

MDK: రాజీవ్‌ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News April 12, 2025

HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 12, 2025

ఖమ్మంలో భానుడి ఉగ్రరూపం.. 41.1 డిగ్రీలు నమోదు

image

ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా ఖమ్మం (రూ) పల్లెగూడెంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నేలకొండపల్లి, ఖమ్మం(U) ఖానాపురం PSలో 41.0, మధిర, ముదిగొండ, చింతకాని 40.9, రఘునాథపాలెంలో 40.7, వైరా, కొణిజర్లలో 40.3, లింగాల (కామేపల్లి), కాకరవాయి (తిరుమలాయపాలెం) 40.0, తల్లాడలో 39.7, సత్తుపల్లిలో 38.7, ఏన్కూరులో 38.6 నమోదైంది.

News April 12, 2025

KMM: ‘నిరుద్యోగ యువకులు 25లోగా అప్లై చేసుకోండి’

image

2025-26 నియామక సంవత్సరానికి అగ్నివీర్ ఎంపిక పరీక్ష కోసం జిల్లాలోని నిరుద్యోగ అవివాహిత యువకులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు www.joinindianarmy.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-27740205కు సంప్రదించాలని పేర్కొన్నారు.

News April 12, 2025

HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 12, 2025

నేరడిగొండ: 52 మందికి TB పాజిటివ్

image

నేరడిగొండ మండలంలో గత నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్దారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ సూచించారు. నేడు 25 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. టీబీ బాధ్యులుగా ఉన్నవారికి 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోశన్న న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, సంతోష్ తదితరులున్నారు.

News April 12, 2025

NZB: సాంఘిక బహిష్కరణలు విధిస్తే వీడీసీలపై కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీడీసీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధికి వీడీసీలు కృషి కొనసాగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని, వీడీసీ ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటే ఎంతమాత్రం చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!