Telangana

News August 31, 2025

KNR: మహిళల పాత్ర అత్యంత కీలకం: మౌలానా

image

KNRలోని నేషనల్ ఫంక్షన్ హాల్‌లో సిటీ జమాత్ ఉలమా ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ రసూల్ సభలో ప్రధాన వక్తగా హజ్రత్ మౌలానా అతిఖ్ అహ్మద్ ఖాస్మి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ,, కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దైవ ప్రవక్త బోధనలు అమలుపరిస్తేనే సమాజంలో శాంతి, న్యాయం, ఐక్యత సాధ్యమవుతుందని వివరించారు. మహిళలు తాలీం (విద్య), తర్బియత్ (పరిగణన, ఆచరణ) విషయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

News August 31, 2025

జానపద దినోత్సవాల్లో ADB కళాకారులు

image

HYDలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ సంబరాల్లో ఆదివారం బాలకేంద్రం చిన్నారులు పాల్గొన్నారు. ఎల్లమ్మ బోనాల పాటపై నృత్య ప్రదర్శన చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు నిర్వాహకులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2025

నేడు చర్లపల్లి నుంచి ADBకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం అన్ రిజర్వుడు టీఓడీ ప్రత్యేక రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌కు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి 8:10 నిమిషాలకు రైలు బయలుదేరి సోమవారం ఉదయం 6:15 నిమిషాలకు అదిలాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.

News August 31, 2025

విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదగాలి: GN శ్రీనివాస్

image

విద్యార్థులు కొత్త టెక్నాలజీను నేర్చుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం MBNRలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2025

HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

image

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.

News August 31, 2025

KNR: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైజ్ఞానిక అధ్యయన తరగతులు

image

ఉమ్మడి KNR, NZB జిల్లాల జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో KNRలోని ఫిల్మ్ భవన్‌లో ఆదివారం అధ్యయన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామచంద్రయ్య ‘శాస్త్రం, శాస్త్ర ప్రచారం, సవాళ్లు’ అంశంపై ప్రసంగించారు. రాజా రాజా ‘ప్రజా సైన్స్ ఉద్యమం, తాత్వికత, అనుభవాలు’ పంచుకోగా, చెలిమెల రాజేశ్వర్ జెవివి కార్యక్రమాలు, పర్యావరణ స్పృహపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెవివి ఆశావహులు పాల్గొన్నారు.

News August 31, 2025

HYD: భూగర్భ విద్యుత్ లైన్‌ల నిర్మాణం ఎప్పుడు?

image

HYDలో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం అనేకసార్లు తెలిపింది. కానీ..ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ ప్రారంభం కాలేదు. తరచూ ఓవర్ హెడ్‌లైన్లు తెగి పడటంతో అనేకచోట్ల ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు బాధిస్తున్నాయి. వెంటనే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ లైన్ కేబుల్స్ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.

News August 31, 2025

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు- SP

image

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

News August 31, 2025

ADB: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

image

జిల్లాస్థాయి యోగాసనా పోటీల్లో పతంజలి యోగా కేంద్రం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్‌ విభాగంలో విష్ణుప్రియ, సంధ్య, సహస్ర, జూనియర్‌ విభాగంలో వైష్ణవి, W.వైష్ణవి మొదటిస్థానం సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి చేతన్‌, సంయుక్త కార్యదర్శి సంతోష్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు.

News August 31, 2025

HYD: పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన SCR

image

అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.