Telangana

News July 6, 2024

బోధన్: ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలి మృతి

image

ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బోధన్‌లో జరిగింది. సాలూరకు చెందిన లక్ష్మీ బాయ్(71) జూన్ నెల 28న హున్సాలోని కూతురు ఇంటికి వెళ్లింది. బాత్‌రూమ్‌కు వెళ్తుండగా నీళ్ల బకెట్‌ తగలడంతో నీళ్లు ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నాగనాథ్ తెలిపారు.

News July 6, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కొండా సురేఖ

image

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు మంత్రులు కాసేపు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రులు సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 6, 2024

KTDM: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి

image

గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. తేజావత్ హరికృష్ణ (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఛాతీ నొప్పి రావడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హరి మృతిచెందినట్లు చెప్పారు. కాగా ఆ బాలుడు చిన్నతనం నుంచే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.

News July 6, 2024

HYD: మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు: MLA కుమారుడు

image

తమను, తమ కార్యకర్తలను ఎంత వేధించినా సరే తాము కాంగ్రెస్‌లో చేరబోమని, BRSలోనే ఉంటామని మహేశ్వరం MLA సబితాఇంద్రారెడ్డి కుమారుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు.. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారాం.. ఇక BRSలోనే కొనసాగుతాం.. పార్టీ ఫిరాయింపులు వద్దని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ వినడంలేదు’ అని అన్నారు.

News July 6, 2024

HYD: మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు: MLA కుమారుడు

image

తమను, తమ కార్యకర్తలను ఎంత వేధించినా సరే తాము కాంగ్రెస్‌లో చేరబోమని, BRSలోనే ఉంటామని మహేశ్వరం MLA సబితాఇంద్రారెడ్డి కుమారుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు.. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారాం.. ఇక BRSలోనే కొనసాగుతాం.. పార్టీ ఫిరాయింపులు వద్దని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ వినడంలేదు’ అని అన్నారు.

News July 6, 2024

నిజామాబాద్‌లో నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించి శనివారం తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త శ్రీరాంకుమార్ తెలిపారు. ఈ నెల 13వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఈనెల 12 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News July 6, 2024

సూర్యాపేట: బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి 

image

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ స్టేజి సమీపంలో 365వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. పెదనేమిలకి చెందిన తన్నీరు సత్తయ్య మృతి చెందాడు. బైక్‌పై సూర్యాపేట నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News July 6, 2024

MBNR: కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే.?

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నడిగడ్డ‌లోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లారు. గత 2 నెలలుగా నడిగడ్డలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది.

News July 6, 2024

సిద్దిపేట: క్షణికావేశంలో ముగ్గురి ఆత్మహత్య

image

క్షణికావేశంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు మందలిచండంతో రాయపోల్ మండలం ఎల్కల్‌కు చెందిన రాజు(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన జాల యాదయ్య(56) చేసిన అప్పులు తీరక సూసైడ్ చేసుకోగా.. అక్కన్నపేటకు చెందిన తంగళ్లపల్లి సాగర్(23)వ్యక్తిగత కారణాలతో ఉరేసుకున్నాడు.

News July 6, 2024

HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్: మంత్రులు

image

HYD హైటెక్స్‌ ప్రాంగణంలో 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మా ఫర్‌ గ్లోబల్‌ వెల్‌బీయింగ్‌ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్ అని మంత్రులు అన్నారు.