India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్ను క్లిక్ చేసి లేదా ఇన్స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.
1. వెంటనే మీ మొబైల్ను ఫ్లైట్ మోడ్కు మార్చండి.
2. అనుమానాస్పద APK ఫైల్ను అన్ఇన్స్టాల్ చేయండి/తొలగించండి.
3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుండి ##002# డయల్ చేయండి.
4. 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు డయల్ చేయండి.
ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు సీసీ టీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీసింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 13 రోజుల శిక్షణలోయూనిఫామ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా నకిలీ APK పైళ్లను సర్కులేట్ చేస్తున్నారని, అలాంటి ఫైళ్లను ఓపెన్ చేసి, ఇన్స్టాల్ చేయవద్దని ఆయన సూచించారు. మోసపూరిత యాప్ లను ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుందని, అలా జరిగినప్పుడు వెంటనే https://www.cybercrime.gov.in సైబర్ క్రైమ్ వెబ్ సైట్ లో కానీ,1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
HYD అమీర్పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
RR జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్లో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్, స్వాతి దంపతులు వారి కుమార్తె రక్షిత(18 నెలలు)ను నానమ్మ దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మాణంలో ఉన్న సంపులో పడిపోయింది. చిన్నారి చేతిలో ఉన్న పెన్ను సంపులో కనిపించడంతో లోపలికి చూశారు. చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.
HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.
రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్ను కలిసేందుకు హుజురాబాద్లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.
Sorry, no posts matched your criteria.