Telangana

News April 12, 2025

బోధన్: IPL బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్

image

బోధన్ బీటీనగర్‌లో ఆన్‌లైన్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న సయిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నరన్నా పక్కా సమచారంతో  సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. విచారణలో NZBకు చెందిన ముజీబ్, సచిన్ ద్వారా ఆన్‌లైన్ ఐడీ క్రియేట్ చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. సయిద్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News April 12, 2025

MDK: వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శ్రీరామ్

image

వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ కార్యక్రమాలైన ఎయిడ్స్, ఫైలేరియా, కుష్టు వ్యాధి, మలేరియా తదితర రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

News April 12, 2025

జైనథ్: ఇసుక అక్రమ రవాణా.. 12మందిపై కేసు

image

జైనథ్ మండలం సాంగ్విలో పెనుగంగ నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీ సీజ్ చేసి చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 మందిపై సెక్షన్ 3, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పీఏ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.

News April 12, 2025

KNR: నేడు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ పాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 12, 2025

తెలంగాణలో టాప్‌ 3లో ఉమ్మడి ADB

image

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4350 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News April 12, 2025

MBNR: రాత్రి వేళల్లో వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

రాత్రి వేళల్లో కూడ వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లాలోని PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో బయోమెట్రిక్ ఏర్పాటుచేసి హాజర్ ను పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పేద రోగులకు సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 12, 2025

వరంగల్: బేకరీల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

image

గొర్రెకుంట, ఇతర ప్రాంతాల్లో పలు బేకరీలలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బేకరీలలో నాణ్యమైన పదార్థాలనే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 12, 2025

ADB: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన సోనిపై కేసు: CI

image

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్టాఫ్‌నర్స్ డబ్బులు కాజేసిన ఘటన ADB లో జరిగింది. వన్ టౌన్ CI సునీల్ కథనం ప్రకారం.. రిమ్స్ స్టాఫ్‌నర్సు సోని ANM శిక్షణ పూర్తి చేసిన మహేశ్వరీకి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.40లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఆమె నమ్మి ఆమె చెప్పిన గజ్జె రాజేందర్ ఖాతాలో డబ్బులను వేసింది. రేపు మాపు అంటూ మాటలు దాటి వేయడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు చేశారు.

News April 12, 2025

మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. భూంపల్లి నివాసి మృతి

image

సిరికొండ మండలం తుంపల్లికి చెందిన పిర్యానాయక్ (35) మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పిర్యానాయక్ మిర్యాలగూడలో వరి కోత హార్వెస్టర్‌ను అక్కడి కి తీసుకెళ్లాడు. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 12, 2025

ADB జిల్లా కోర్టులో PPలు వీరే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది అబ్దుల్ రహీం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మరో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వీరిద్దరి పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ సందర్భంగా వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.

error: Content is protected !!