Telangana

News August 31, 2025

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు- SP

image

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

News August 31, 2025

ADB: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

image

జిల్లాస్థాయి యోగాసనా పోటీల్లో పతంజలి యోగా కేంద్రం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్‌ విభాగంలో విష్ణుప్రియ, సంధ్య, సహస్ర, జూనియర్‌ విభాగంలో వైష్ణవి, W.వైష్ణవి మొదటిస్థానం సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి చేతన్‌, సంయుక్త కార్యదర్శి సంతోష్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు.

News August 31, 2025

HYD: పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన SCR

image

అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.

News August 31, 2025

HYD: రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా బంద్

image

HYDలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి తెలిపింది. షేక్‌పేట్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 7 గంటల వరకు మంచినీటి సరఫరా బంద్ కానుంది.

News August 31, 2025

పాలమూరు: మొత్తం విగ్రహాలు..@2,447

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా మహబూబ్‌నగర్ రూరల్ PS పరిధిలో 300, అత్యల్పంగా మిడ్జిల్ PS పరిధిలో 88 రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అన్ని వినాయక మండపాల జియో-ట్యాగింగ్ పూర్తి నిమజ్జన రూట్‌మ్యాప్‌‌తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News August 31, 2025

NLG: అటకెక్కిన ఆటల పీరియడ్!

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పీరియడ్ అటకెక్కింది. అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పీఈటీలు, మైదానాలు నిధుల కొరత వెక్కిరిస్తుంది. జిల్లాలో మెజారిటీ పీఈటీలు కాలక్షేపానికి, ఇతర విధులకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు క్రీడా కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓలు కార్యాలయాలకే పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి.

News August 31, 2025

HYD: GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు.!

image

కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు

News August 31, 2025

నల్గొండను ఎండబెట్టారు: మంత్రి కోమటిరెడ్డి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డుకుని ఎండబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో మాట్లాడతామని స్పష్టం చేశారు. కవిత ‘లిల్లీపుట్’ వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డి పరువు తీసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

News August 31, 2025

HYD: సండే ఆన్ సైక్లింగ్ ప్రారంభించిన గవర్నర్

image

HYDలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ 2025లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సైక్లింగ్ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందని గవర్నర్ అన్నారు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

News August 31, 2025

కరీంనగర్‌లో SEPT 3న JOB MELA..!

image

నిరుద్యోగులకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SEPT 3న జిల్లా ఉపాధి కార్యలయంలో ఈ JOB MELA నిర్వహిస్తునట్లు చెప్పారు. 120పోస్టులు ఉన్నాయని.. ఫార్మాసిస్టు, సేల్స్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10TH నుంచి ఫార్మసీ చదివినవారు అర్హులని, వయసు 18-30ఏళ్లలోపు ఉండాలన్నారు. 9392310323, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చు.