Telangana

News July 5, 2024

కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

image

కరీంనగర్ పరిషత్ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నాటికి ఎంపీటీసీలు, జడ్పీటిసిల పదవీకాలం ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌కు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

News July 5, 2024

హైదరాబాద్‌లో వాచ్‌మెన్ దారుణ హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వాచ్​మెన్​ దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలగూడ CI అనుదీప్​ కథనం ప్రకారం.. ఉప్పరిబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనంలో కుమ్మరి రామచంద్రయ్య (40) వాచ్​మెన్‌గా పనిచేస్తున్నాడు. రాళ్ల పనిచేసే సలీమ్​‌తో కలిసి నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ జరిగింది. క్షణికావేశంలో సలీమ్​ రామచంద్రయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య చనిపోయాడు.

News July 5, 2024

ఆదిలాబాద్: ఉచిత సివిల్ శిక్షణకు దరఖాస్తులు

image

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

హైదరాబాద్‌లో వాచ్‌మెన్ దారుణ హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వాచ్​మెన్​ దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలగూడ CI అనుదీప్​ కథనం ప్రకారం.. ఉప్పరిబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనంలో కుమ్మరి రామచంద్రయ్య (40) వాచ్​మెన్‌గా పనిచేస్తున్నాడు. రాళ్ల పనిచేసే సలీమ్​‌తో కలిసి నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ జరిగింది. క్షణికావేశంలో సలీమ్​ రామచంద్రయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య చనిపోయాడు.

News July 5, 2024

ఈ నెల 9నుంచి ఖమ్మం ఆస్పత్రిలో సదరం క్యాంపులు

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 24 వరకు నిర్దేశించిన తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు ధ్రువీకరణ పత్రం కోసం దగ్గర్లోని మీసేవ సెంటర్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. క్యాంపుకు వచ్చే దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకున్న రసీదు, ఆధార్ కార్డు, మెడికల్ రిపోర్ట్, పాస్ ఫొటో తీసుకురావాలన్నారు.

News July 5, 2024

పిట్లం: UPDATE.. చిన్న గొడవ.. చెరువులో దూకి ఆత్మహత్య

image

పిట్లంలోని మారేడ్ చెరువులో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీరేష్ వివరాలిలా.. పిట్లం వాసి చిలుక అంజవ్వకు (41) ఇవాళ తన అత్త మానేవ్వతో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైనా అంజవ్వ క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

MHBD: కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంతాలపల్లి మండలం చారి తండా శివారులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

చెన్నూరు: కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంకు దగ్గర కారు బైక్ కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు వారు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 5, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని MBNR జిల్లాకలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. డ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలలో పర్యటించి ఆమె పరిశీలించారు. చెత్త, చెదారం రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని కాలనీవాసులకు సూచించారు. మురుగునీరు ప్రవహించేలా డ్రైనేజీలను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News July 5, 2024

NLG: జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు భేష్

image

నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.