Telangana

News July 5, 2024

HYD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. అత్తాపూర్ PS పరిధిలో నివసించే ఓ బాలిక ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది.

News July 5, 2024

HYD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. అత్తాపూర్ PS పరిధిలో నివసించే ఓ బాలిక ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది.

News July 5, 2024

మెదక్: పరేషాన్‌లో గ్రామ పంచాయతీలు..!

image

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్‌(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆర్నెళ్లుగా పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని తెలిసింది. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేకాధికారుల పాలనకు ముందే పంచాయతీల్లో నిధులు ఖాళీ అయ్యాయి.

News July 5, 2024

ఆదిలాబాద్: నిందితుడి కోసం వెళ్లి.. నింగిలోకి

image

ఆదిలాబాద్‌కు చెందిన ASI యునాస్ ఖాన్ నిన్న <<13567244>>గుండెపోటుతో <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఓ కేసులో కోర్టుకు హాజరు కాని నిందితుడికి కోసం SI, కానిస్టేబుల్తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లాల్సి ఉంది. మెహిదీపట్నం నుంచి రూట్ 5కే సెట్విన్ బస్సులో యూనస్ ఖాన్ సికింద్రాబాద్ బయలుదేరాడు. బస్సు బాటా వద్దకు వచ్చేసరికి గుండెపోటుతో సీటులో నుంచి జారి కిందపడ్డాడు.

News July 5, 2024

NGKL: పిల్లలు పుట్టడం లేదని మహిళ సూసైడ్

image

పిల్లలు కావడంలేదని ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. చారకొండ మండలం శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)కి APలోని కంభంపాడుకు చెందిన శేషుతో 2014లో పెళ్లైంది. పిల్లలు కాకపోవడంతో దంపతులు తరచూ గొడవ పడేవారు. ఆమె 3నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. బుధవారం భర్తకు ఫోన్‌ చేసి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయంది. ఘటనపై నిన్న కేసు నమోదైంది.

News July 5, 2024

NZB: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్‌వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.

News July 5, 2024

హనుమకొండ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం

image

ఏటూరునాగారానికి చెందిన ప్రవీణ్ కుమార్(30), హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన యువతి (28) కలిసి డిగ్రీ చదివారు. అప్పటి నుంచే ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం భీమారంలోనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లి చేసుకోమని యువతి కోరగా నిరాకరించాడు. దీంతో యువకుడిపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు KU ఎస్సై సురేశ్ తెలిపారు.

News July 5, 2024

గ్రేటర్ HYDలో ఆస్తి పన్ను పరిస్థితిపై FOCUS!

image

గ్రేటర్ HYD ఆస్తిపన్ను పరిధిలో భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20 వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ.2500 కోట్ల మేర రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు సమస్యలు తీర్చి, ఆస్తి పన్నును పకడ్బందీగా వసూలు చేసే విధానం పై కసరత్తు చేస్తున్నారు.

News July 5, 2024

గ్రేటర్ HYDలో ఆస్తి పన్ను పరిస్థితిపై FOCUS!

image

గ్రేటర్ HYD ఆస్తిపన్ను పరిధిలో భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20 వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ.2500 కోట్ల మేర రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు సమస్యలు తీర్చి, ఆస్తి పన్నును పకడ్బందీగా వసూలు చేసే విధానం పై కసరత్తు చేస్తున్నారు.

News July 5, 2024

ప్రేమ వ్యవహారంలో గొడవ.. ఒకరిపై కత్తి పోట్లు

image

ప్రేమ వ్యవహారంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. సాహెబ్‌నగర్‌కు చెందిన శివ(22), నల్గొండ జిల్లాకు చెందిన బాలిక ప్రేమించుకున్నారు. బాలికను శివ బుధవారం సాహెబ్ నగర్‌కు తీసుకొచ్చాడు. బాలిక కుటుంబీకులు సాహెబ్‌నగర్‌కు రాగా ఇరు కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. శివ సోదరుడు శ్రీకాంత్ బాలిక తరఫు వ్యక్తిని కత్తితో పొడిచాడు. కేసు నమోదైంది.