Telangana

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!1/2

image

✒MBNR-జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్ ✒అడ్డాకుల-జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ✒బాలానగర్-జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బాబురావు ✒భూత్పూర్-జిల్లా హర్టీకల్చర్, సెరీకల్చర్ అధికారి కె.వేణుగోపాల్ ✒సీసీ కుంట-జిల్లా యువజన,క్రీడల అధికారి ఎస్. శ్రీనివాస్ ✒దేవరకద్ర-స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి ✒హన్వాడ-DRDO పి.నర్సింహులు ✒జడ్చర్ల-RDO నవీన్ ✒గండీడ్-SC సంక్షేమ శాఖ డీడీ వి.పాండు

News July 4, 2024

MBNR: మండల పరిషత్తులకు స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే!2/2

image

✒రాజాపూర్-జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్.ఇందిర ✒నవాబు పేట-జిల్లా సహకార అధికారి ఎ. పద్మ ✒మూసాపేట-జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి ✒మిడ్జిల్-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. వెంకటేశ్ ✒కోయిలకొండ-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి.మధుసూదన్ గౌడ్ NOTE:నేటి నుంచి నుంచి ఆయా మండలాలకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.

News July 4, 2024

నారాయణపేటలో రోడ్డు ప్రమాదం

image

నారాయణపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గొడుగేరి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఇద్దరు యువకులు స్కూటీపై ప్రధాన రహదారి పైకి వస్తుండగా అదుపుతప్పి వేగంగా వెళుతున్న టిప్పర్ కిందపడి నరసింహారెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి చేతికి బలమైన గాయం తగిలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

News July 4, 2024

ఖమ్మం: మహిళపై కత్తితో దాడి

image

చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో శిరీష (26) అనే మహిళపై పావని అనే మహిళ కత్తితో దాడి చేసింది. శిరీష‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శిరీష‌తో తన భర్త దుర్గాప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో శిరీషపై పావని దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

News July 4, 2024

FLASH.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్

image

కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన దాడుల్లో మేనేజర్ వెంకటేశ్వర రావు, క్యాషియర్ కుమారస్వామిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.

News July 4, 2024

వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి

image

హైదరాబాదుకు దీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలో ఈరోజు ఆయన పర్యటించి కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతమని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల భర్తీకి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

News July 4, 2024

ఆదిలాబాద్: NACలో ఉద్యోగ అవకాశాలు

image

బెల్లంపల్లి NAC సెంటర్‌లో కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లిష్ నేర్పించుటకు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా NAC ఏడీ నాగేంద్రం తెలిపారు. MA ఇంగ్లిష్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న యువకులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.

News July 4, 2024

NGKL: విద్యుదాఘాతంతో బాలుడు మృతి

image

విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన విషాద ఘటన రాజాపూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రేకులపల్లి గ్రామ పరిధిలోని ఒప్పితండాకు చెందిన శివ(15) గ్రామపంచాయితీలో విద్యుత్ బల్బును అమర్చుతున్నాడు. పక్కనే ఉన్న 11కేజీ వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి బాలుడిపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

News July 4, 2024

MHBD: ‘నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలపై పోలీస్ సిబ్బంది తప్పక అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ అన్నారు. నూతన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన పుస్తకాలను పోలీస్ సిబ్బందికి నేడు అందజేశారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి క్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నపుడే బాధితులకు న్యాయం చేయగలరని అన్నారు.

News July 4, 2024

రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తదితర అంశాలపై సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధికారులు నిజాయితీగా సేవలు అందించాలని మంత్రులు అన్నారు.