India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల రెండవ శనివారం, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ రాజీవ్ యువశక్తి పథకం కింద దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలలో స్పష్టం చేశారు. రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువత స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా డీఎంసీ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్/ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 21 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోని ఆసక్తి గల యువత https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్లో ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రైతన్నలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, చెడు అలవాట్లను మానుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ (మం) కాచిరాజుగూడెంలో ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతుల కోసం మాత్రమే ఉందని, రైతుల కష్టాలను తొలగింపుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించి, వరి ధాన్యం సేకరణను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సింగిల్ విండో డైరెక్టర్ లు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి ఇలాంటి జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై సంపూర్ణంగా వినియోగించుకోవడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని సీపీ సాయి చైతన్య కోరారు .ఇందుకోసం నిజామాబాద్ ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది TSSP బెటాలియన్ సిబ్బంది తో బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
TAX వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. బల్దియా చరిత్రలో తొలిసారి రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు అయ్యిందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేశారన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు శుక్రవారం బంజారాభవన్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. OTS పథకంతో మంచి ఫలితాలు వచ్చాయని, 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.2,038 కోట్లకుపైగా వసూలయ్యాయని కమిషనర్ స్పష్టం చేశారు.
☆ సెక్టర్ ఆఫీసర్లు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి: ఖమ్మం సీపీ ☆ జిల్లాలో 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం: అ.కలెక్టర్ ☆ KMM: వాకింగ్ వెళ్తుండగా ప్రమాదం.. వృద్ధుడి మృతి ☆ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఫులే జయంతి ☆ రైస్ మిల్లర్లకు ముదిగొండ తహశీల్దార్ వార్నింగ్ ☆ ఖమ్మం: 20 మందికి రూ.10.7 లక్షల చెక్కులు పంపిణీ ☆ NKP: రైతుల కన్నీటి పర్యంతం (VIDEO) ☆ KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం.
సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతురిని చంపిన కేసులో తల్లికి కోర్టు ఉరి శిక్ష విధించింది. కూతరుకు మతిస్థిమితం లేకపోవడంతో ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. మోతె మండలం మేకలపాటి తండాలో ఏప్రిల్ 2021లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి విచారణ జరగుతుండగా తాజాగా భానోత్ భారతికి కోర్టు శిక్ష విధించింది.
Sorry, no posts matched your criteria.