Telangana

News August 31, 2025

HYD: కృష్ణానగర్ నివాసితులతో త్వరలో సమావేశం: కమిషనర్

image

HYDలో వరదలకు గల కారణాలను అన్వేషిస్తూ, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ తెలియజేశారు. త్వరలో కృష్ణానగర్ నివాసితులతో సమావేశం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. అమీర్పేట, కృష్ణానగర్ ప్రాంతంలో నాలా డీసిల్టింగ్ పక్రియ వేగంగా జరుగుతుండగా, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.

News August 31, 2025

మెదక్: సెలవైనా.. అధికారులు విధుల్లో ఉండాల్సిందే: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. సింగూరు నుంచి మంజీరా నదికి భారీగా నీరు విడుదల అవుతున్నందున, వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

News August 31, 2025

HYD: నేడు, రేపు వర్షాలు అలర్ట్!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. వర్షం ఒక్కసారిగా ప్రారంభమై కురిసే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా అధికారులు వివరించారు.

News August 31, 2025

NLG: పత్తి రైతు పరేషాన్.. దిగుబడిపై ప్రభావం

image

ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి చేలలో ఇంకా తడారలేదు. వరద నీటిలోనే మొక్కలు ఉండడం అధిక తడితో మొలకలు ఎర్రబారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మొక్కలు ఎదిగే సమయానికి భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల పత్తి చేలల్లోకి నీళ్లు వచ్చాయని రైతులు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.

News August 31, 2025

వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

image

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది.

News August 31, 2025

NLG: రేషన్ డీలర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్‌ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను మొత్తం రూ.140 (రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50) కమీషన్ రూపంలో డీలరుకు అందుతుంది.

News August 31, 2025

NLG: గతేడాది కంటే తక్కువే..!

image

ఖరీఫ్ సీజన్ సాగు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,73,162 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. సింహభాగంలో పత్తి.. ఆ తర్వాత వరి సాగైంది. ఈసీజన్లో 11.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత వానాకాలం సీజన్లో 11.60,374 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి తక్కువగానే రైతులు సాగు చేస్తున్నారు.

News August 31, 2025

అంగన్వాడీలకు PD కీలక సూచన

image

అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు EKYC, THRలో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. ప్రస్తుతం EKYCలు 96 శాతం ఉందని దాన్ని నూరు శాతం చేయాలని, THRలు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని 30 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు.

News August 31, 2025

WGL: తప్పుల తడకగా ఓటర్ల జాబితా..! మరో మండలంలో వెలుగులోకి..!

image

గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడంతో పాటు మరణించిన వారి పేర్ల మీద సైతం ఇంకా ఓట్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. తాజాగా గీసుగొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన కౌడగాని రాజగోపాల్ కుటుంబ సభ్యుల నాలుగు ఓట్లు మూడు వార్డుల్లో నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

News August 31, 2025

MBNR: నీటిగుంతలో పడి వ్యక్తి మృతి

image

వినాయక నిమజ్జనానికి వెళ్లి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం బోడ జానంపేటలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం కావేరమ్మపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు BSCPL క్రషర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కంపెనీలో ఉన్న గణేశుని నిమజ్జనం చేశారు. ప్రమాదవశాత్తు ఆంజనేయులు గుంతలో పడ్డాడు. శుక్రవారం నుంచి గాలించగా శనివారం సాయంత్రం
అతని మృతదేహన్ని బయటికి తీశారు.