Telangana

News September 19, 2024

CP-5 ప్రాజెక్టులో నిలిచిపోయిన ఓవర్ బర్డెన్ పనులు

image

రామగుండం సింగరేణి సంస్థ OCP-5లో ఓవర్ బర్డెన్ వెలికి తీసే ఓ ప్రైవేట్ కంపెనీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత రెండు రోజుల నుంచి భూ నిర్వాసితులకు పటేల్ కంపెనీలో 80% మంది స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన చేపట్టి పనులను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టులో ఓబీ వెలికితీత పనులకు బ్రేక్ పడింది. ఈ సంఘటనపై సింగరేణి యాజమాన్యం స్పందించాలని భూనిర్వాసితులు కోరుతున్నారు.

News September 19, 2024

కూసుమంచి: పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల

image

పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

News September 19, 2024

పినపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 19, 2024

సైన్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్‌కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 19, 2024

HYD: సేవాసంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునివృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు విశేష సేవలు అందించిన సంస్థలు ఈనెల 25లోపు హైదరాబాద్ నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తులు అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫార్మ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. www.wdsc.telangana.gov.in

News September 19, 2024

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్

image

కోనరావుపేట మండలం మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గురువారం ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం, బోధనను అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.

News September 19, 2024

NSPT: అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

image

నర్సంపేట నియోజకవర్గంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారని, నాటి అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతుందని ‘X’లో మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

News September 19, 2024

BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా

image

కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.