India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులకు రైల్వే అధికారులు సింగల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు వరంగల్ రైల్వేస్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈ యంత్రంలో పడవేస్తే, తుక్కు తుక్కుగా మారుస్తుందని అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలిపారు.
NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.
స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్లో గురువారం స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. స్కూలు ఆవరణలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మొక్క నాటారు.
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో కలవెని రాజేశం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొత్తపల్లి-కొలనూరు మధ్యగల రహదారిపై గురువారం హత్య చేశారు. రాజేశం గతంలో రైల్వే శాఖలో పనిచేసి ఇటీవలే రిటైర్మెంట్ అయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామగుండం సింగరేణి సంస్థ OCP-5లో ఓవర్ బర్డెన్ వెలికి తీసే ఓ ప్రైవేట్ కంపెనీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత రెండు రోజుల నుంచి భూ నిర్వాసితులకు పటేల్ కంపెనీలో 80% మంది స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన చేపట్టి పనులను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టులో ఓబీ వెలికితీత పనులకు బ్రేక్ పడింది. ఈ సంఘటనపై సింగరేణి యాజమాన్యం స్పందించాలని భూనిర్వాసితులు కోరుతున్నారు.
పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునివృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు విశేష సేవలు అందించిన సంస్థలు ఈనెల 25లోపు హైదరాబాద్ నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తులు అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫార్మ్ వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు. www.wdsc.telangana.gov.in
కోనరావుపేట మండలం మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గురువారం ఈ సందర్భంగా విద్యార్థులు, టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం, బోధనను అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
Sorry, no posts matched your criteria.