India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణ, సమాన హక్కులకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన చేసిన కృషిని కొనియాడారు. సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు (శుక్రవారం) చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,250 పలికింది. అలాగే పసుపు (కాడి) క్వింటా ధర రూ.13,659, పసుపు (గోల)కి రూ.12,689 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,320 పలికినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మక్కల ధర 2 రోజులతో పోలిస్తే పెరిగింది.
విద్యార్థులకు అపార్ గుర్తింపు నమోదులో NZB జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో మొత్తం 62.83 శాతం మందికి అపార్ గుర్తింపు నంబరును జారీ చేయగా మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా ఉంది. ఐదవ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచినట్లు డీఈవో అశోక్ తెలిపారు. అపార్ మోదులో సమస్యలను పరిశీలించి త్వరలోనే మొదటి స్థానంలో నిలుపుతామని డీఈఓ అన్నారు.
ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.
నారాయణపేట జిల్లా మరికల్లో నాయీ బ్రాహ్మణ శ్మశాన వాటికకు నిత్యం వాగులో నుంచి నడుచుకుంటూ అంత్యక్రియలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటనపై బుధవారం Way2Newsలో <<16039649>>‘అంతిమయాత్రకు తప్పని తిప్పలు’<<>> అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులు వంతెన నిర్మించేందుకు కొలతలను తీసుకెళ్లారు.
అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని కోరారు. విగ్రహాన్ని ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామని, రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని పేర్కొన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు శనివారం, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా రైతులు గమనించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మార్కెట్ తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని చెప్పారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, బిసి విద్యార్థి సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు కమలాకర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే కొనసాగుతాయని చెప్పారు.
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.
Sorry, no posts matched your criteria.