India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తిధరలు నిలకడ కోల్పోతున్నాయి. నిన్న సోమవారం 7, 160 పత్తికి ధర పలకగా ఈరోజు (మంగళవారం) స్వల్పంగా పది రూపాయలు పెరిగి రూ.7,170 ధర పలికింది. మద్దతు ధర కంటే మార్కెట్లో పత్తికి ధర తక్కువ పలుకుతుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పత్తి ధరలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి వంశీకృష్ణ(19) HYD హయత్నగర్ శాంతినగర్లో ఉంటూ మెకానిక్గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2 రోజులు రూమ్లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RR జిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఉమ్మడి జిల్లాలో SGTల బదిలీల ప్రక్రియ ముగిసింది. కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు కూడా స్థాన చలనం కలిగింది. SGT సమాన స్థాయి ఉపాధ్యాయులకు అధికారులు సోమవారం బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్లో ఉంచారు. MBNR-1,043, NGKL-847,
GDWL-506, NRPT-466, WNPT-572 మంది బదిలీ అయ్యారు. SGTలతో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,363 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగింది.
పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి వంశీకృష్ణ(19) HYD హయత్నగర్ శాంతినగర్లో ఉంటూ మెకానిగ్గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2 రోజులు రూమ్లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RR జిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సుదీర్ఘ విరామం తర్వాత పూర్తైంది. సంగారెడ్డి జిల్లాలో 915 మందికి పదోన్నతి దక్కగా.. 2267 మందికి స్థాన చలనం కలిగింది. సిద్దిపేట జిల్లాలోని మొత్తం 980 పాఠశాలల్లో 4136 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 622 మందికి పదోన్నతి, 1032 మంది బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని DEOలు అన్నారు.
తల్లిగారింట్లో పుట్టినరోజు చేసుకోవాలని వచ్చిన వివాహిత అదేరోజు కరెంట్ షాక్తో మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం.. రాజపేట మండలం పారుపల్లి వాసి భూపతి సురేశ్, బాలాంజలి దంపతులు. సోమవారం బర్త్ డే సందర్భంగా పిల్లలు, భర్తతో కలిసి గౌరాయిపల్లికి వచ్చింది. బట్టలు ఉతుకుతుండగా కరెంట్ షాక్కు గురైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మహబూబ్నగర్లో రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే SI సయ్యద్ అక్బర్ వివరాలు.. స్థానిక శ్రీరాం కాలనీలో ఉంటున్న శివానంద్(50), ఆయన కుమార్తె చందన(20) ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్గా, ల్యాబ్ టెక్నిషియన్గా చేస్తున్నారు. సోమవారం రాత్రి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నారు. వీరి స్వస్థలం వికారాబాద్(D) మందిపల్. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.
కొత్త న్యాయ, నేర చట్టాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 10 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులు, జగిత్యాల జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మొదటి రోజు కేసుల నమోదు, సెక్షన్ల నమోదు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
రాంగ్ రూట్లో వచ్చిన 18 బైక్లను HYD గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ యూటర్న్ వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పోలీసులు బైకర్లను అడ్డగించారు. కొత్త చట్టం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఇది గచ్చిబౌలి పీఎస్లో కొత్త చట్టం ప్రకారం నమోదు చేసిన మొదటి కేసు అని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.
రాంగ్ రూట్లో వచ్చిన 18 బైక్లను HYD గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ యూటర్న్ వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పోలీసులు బైకర్లను అడ్డగించారు. కొత్త చట్టం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఇది గచ్చిబౌలి పీఎస్లో కొత్త చట్టం ప్రకారం నమోదు చేసిన మొదటి కేసు అని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.
Sorry, no posts matched your criteria.