Telangana

News July 2, 2024

HYD: సబిత ఫ్లెక్సీ దహనం.. PSలో ఫిర్యాదు

image

మహేశ్వరంలో MLA సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీ‌ని దిష్టిబొమ్మ‌గా తయారుచేసి కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ మహేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక PSలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని సబిత స్పష్టం చేసినా.. పలువురు INC నేతలు చేర్చుకోవద్దని ధర్నా చేయడం‌ గమనార్హం. దీనిపై మీ కామెంట్?

News July 2, 2024

RG-1లో 103 శాతం బొగ్గు ఉత్పత్తి

image

రామగుండం సింగరేణి సంస్థ RG-1లో గత నెల 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు GMచింతల శ్రీనివాస్ తెలియజేశారు. జూన్‌లో 3,58,900 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగానూ 3,70,418 టన్నులతో 103% ఉత్పత్తి సాధించామన్నారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను RG- 1 ఏరియాకు 49,40,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామన్నారు.

News July 2, 2024

చిన్నారులకు అభయహస్తం అందించాలి: సీపీ

image

ఖమ్మం: తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నెల పాటు జరిగే కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు.

News July 2, 2024

HYD: సబిత ఫ్లెక్సీ దహనం.. PSలో ఫిర్యాదు

image

మహేశ్వరంలో MLA సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీ‌ని దిష్టిబొమ్మ‌గా తయారుచేసి కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ మహేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక PSలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని సబిత స్పష్టం చేసినా.. పలువురు INC నేతలు చేర్చుకోవద్దని ధర్నా చేయడం‌ గమనార్హం. దీనిపై మీ కామెంట్?

News July 2, 2024

వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు ఏఎస్పీల బదిలీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకవార్ భద్రాచలంకు, గ్రేహౌండ్స్ నుంచి శివమ్ ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 1, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవద్దని నిరసన
✓సికింద్రాబాద్: మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగుల నిరసన నే ✓సికింద్రాబాద్: గాంధీలో టెన్షన్.. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్
✓NEET అంశం పై నిరసన.. ఎమ్మెల్సీ వెంకట్ అరెస్ట్
✓HYD: మోతిలాల్ నాయక్‌కు మద్దతుగా OUలో నిరసన
✓నార్సింగి: ఇంజినీర్ హత్యలో రిలేషన్ కోణం
✓అన్ని GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి

News July 1, 2024

HYD: బ్యాంక్ ఛైర్మన్ బాత్‌రూమ్‌లో ఉద్యోగి సూసైడ్

image

నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కో-అపరిటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ 3వ అంతస్థులో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌కు చెందిన నాలుగవ తరగతి ఉద్యోగి ఓంకార్ ఛైర్మన్ బాత్ రూమ్ కిటికీకి ఉరివేసుకుని బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో పలు వార్డులను పరిశీలించిన కలెక్టర్. @ పెద్దపల్లిలో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి. @ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు సస్పెండ్. @ కరీంనగర్ ప్రజావాణి కి 370, జగిత్యాల ప్రజావాణికి 44 ఫిర్యాదులు. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ కథలాపూర్ మండలంలో బైక్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డాక్టర్స్ డే.

News July 1, 2024

కొడంగల్: పురుగు మందు తాగి బాలుడు ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంటకు వెంకటేష్ (16) చదువు మధ్యలోనే వదిలేశాడు. కాగా అతను కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్దామని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లిన బాలుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కొడంగల్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి చెప్పారు.

News July 1, 2024

బూర్గుపల్లి: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఇంట్లో దూలానికి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలి ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మరెల్లి ఆనంద్ రాజ్ (28) తన ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.