Telangana

News July 1, 2024

సైబరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.

News July 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి కార్యక్రమాలు

image

@ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి కొత్త చట్టాలు అమలు..
@ మక్తల్: ఉచిత కంటి వైద్య శిబిరం.
@ షాద్నగర్: నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే.
@ దామరగిద్ద, జడ్చర్లలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.
@ ఐజ సింగిల్ విండో సమావేశం.
@ మక్తల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
@ కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహవిష్కరణ.
@ పెద్దకొత్తపల్లి: తైబజార్ వేలం

News July 1, 2024

MHBD: ఓ వ్యక్తి వేధింపులు.. భార్య మృతి, భర్త సీరియస్

image

ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.

News July 1, 2024

KNR స్మార్ట్‌సిటీ పనుల పూర్తికి అవకాశం

image

స్మార్ట్‌సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్‌ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.

News July 1, 2024

ముమ్మరంగా వానాకాలం పంటల నమోదు ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు.

News July 1, 2024

ఖమ్మం: చింత చిగురు కోస్తుండగా పాము కాటు, మహిళ మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.

News July 1, 2024

హైదరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా HYD కమిషనరేట్ పరిధిలో హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 36, బంజారాహిల్స్ రోడ్డు నంబర్లు 1,2, మహారాజ అగ్రసేన్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.

News July 1, 2024

హైదరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా HYD కమిషనరేట్ పరిధిలో హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 36, బంజారాహిల్స్ రోడ్డు నంబర్లు 1,2, మహారాజ అగ్రసేన్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి. 

News July 1, 2024

భైంసా: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 1, 2024

గతంలో పనిచేసిన లెక్చరర్లకు ఆహ్వానం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
వివిధ సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత ఉండడంతో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం, లెక్చరర్లను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ ఏడాది కూడా బోధన ప్రారంభించగా, గెస్ట్ లెక్చరర్లను సైతం విధుల్లో చేరాలని అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా, జిల్లాలోని 20 కళాశాలల్లో 58 గెస్ట్ లెక్చరర్లు, 8మంది పార్ట్ టైం, 29మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు.