Telangana

News July 1, 2024

ఖమ్మం: రైళ్లకు మరో రెండు బోగీలు.. వారికి ఊరట

image

ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లల్లో అదనంగా మరో రెండు జనరల్‌ బోగీలను పెంచనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. దీని పల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణిస్తున్న సుమారు 6 వేల మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ కార్మికులే ఉన్నారు. కాకతీయ, సింగరేణి, మణుగూరు, బెళగావి రైళ్లను రెండు బోగీలు తగిలించనున్నారు.

News July 1, 2024

BREAKING.. మహబూబాబాద్‌లో పురుగు మందు తాగిన SI

image

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

ఉమ్మడి పాలమూరులో గొర్రెల పంపిణీపై ప్రత్యేక ఫోకస్ !

image

గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాల నేపథ్యంలో గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి, రెండో విడతల కింద ఉమ్మడి జిల్లాలో 70,688 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల వద్ద గొర్రెల సంఖ్య తగ్గిందని అధికారులు గుర్తించారు. త్వరలో లెక్కలు తేల్చనున్నారు.

News July 1, 2024

KNR: అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం

image

అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షమైన ఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మన్విత అనే చిన్నారికి అంగన్వాడి కేంద్రంలో కోడిగుడ్లు ఇచ్చారు. ఆదివారం చిన్నారికి కోడిగుడ్డును ఇచ్చేందుకు మన్విత తల్లి గుడ్డును ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే గుడ్డుపై పెంకు తొలగించి చూడగా లోపల కోడి పిల్ల కదులుతూ కనిపించింది. దీంతో వారు షాక్ అయ్యారు.

News July 1, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పునః ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News July 1, 2024

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు
పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను
తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.

News July 1, 2024

HYD: కార్ సీఎన్జీ కిట్‌లో గంజాయి అమర్చి అడ్డంగా బుక్కయ్యాడు

image

ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్‌లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌తో పాటు.. పలు పీఎస్‌లలో సురేష్‌పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.

News July 1, 2024

HYD: కార్ సీఎన్జీ కిట్‌లో గంజాయి అమర్చి అడ్డంగా బుక్కయ్యాడు

image

ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్‌లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌తో పాటు.. పలు పీఎస్‌లలో సురేష్‌పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.

News July 1, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నం

image

కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.

News July 1, 2024

కామారెడ్డి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సివిల్ జడ్జ్

image

రైతులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి సివిల్ జడ్జ్ సుధాకర్ చెప్పారు. మండల కేంద్రంలో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయినప్పుడు న్యాయపరంగా పొందే హక్కుల గురించి ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.