Telangana

News June 30, 2024

కిషన్ రెడ్డి అబద్ధాలలో మోదీని మించిపోయారు: MLA కూనంనేని

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి నేతృత్వంలోనే సింగరేణి బొగ్గు గనులు వేలం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

News June 30, 2024

పాలమూరు బిడ్డకు సీఎం శుభాకాంక్షలు

image

SBI నూతన ఛైర్మన్‌గా పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులుశెట్టి నియమితులు కాబోతున్నారు. గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్ఠాత్మకమైన SBI ఛైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని CM రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో మరెన్నో విజయాలు, ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారు. కాగా ప్రస్తుతం SBI మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శెట్టి ఛైర్మన్‌గా ఆగస్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.

News June 30, 2024

HYD: కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి కిడ్నాప్.. అత్యాచారం!

image

HYD నగరంలో బాలికపై జరిగిన అత్యాచారం కలకలం రేపుతోంది. ఓ బాలికకు కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి, కిడ్నాప్ చేసిన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నరేష్, విజయ్‌తో పాటు.. దాదాపు 8 మందిని అరెస్టు చేశారు.

News June 30, 2024

HYD: కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి కిడ్నాప్.. అత్యాచారం!

image

HYD నగరంలో బాలికపై జరిగిన అత్యాచారం కలకలం రేపుతోంది. ఓ బాలికకు కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి, కిడ్నాప్ చేసిన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నరేష్, విజయ్‌తో పాటు.. దాదాపు 8 మందిని అరెస్టు చేశారు.

News June 30, 2024

ఖమ్మం: GREAT.. ఆల్ ఇండియా 35వ ర్యాంకు

image

ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్‌ను పలువురు అభినందించారు.

News June 30, 2024

రేపు ఆదిలాబాద్‌లో మంత్రి పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

రాష్ట్ర పంచాయితి రాజ్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉ.9.15 ని.కు ఉట్నూర్‌లో బీటీ రోడ్ ప్రారంభిస్తారు. 9:30కు అక్కడి నుండి బయలుదేరి 10:30కు మావల అర్బన్ పార్క్‌లో వన మహోత్సవానికి హాజరవుతారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు వీల్ చెయిర్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.

News June 30, 2024

వికారాబాద్: జిల్లాలోని ముఖ్యమైన వార్తలు!

image

✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏T20WC ఛాంపియన్‌గా ఇండియా.. జిల్లాలో సంబరాలు
✏VKBD: రేపు ప్రజావాణి
✏జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✏గండీడ్, మహమ్మదాబాద్: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగించండి
✏వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
✏పరిగి: రోజురోజుకు పెరుగుతున్న చోరీలు.. ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు
✏మహమ్మదాబాద్: నూతన జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

News June 30, 2024

పార్టీ మార్పుపై జగిత్యాల ఎమ్మెల్యే కీలకవ్యాఖ్యలు

image

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు తనతోపాటు నడవాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

News June 30, 2024

MP అభ్యర్థులు అకౌంట్ వివరాలివ్వాలి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్  

image

ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ వివరాలను వ్యయ పరిశీలకులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్  కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. 

News June 30, 2024

ఆర్మూర్‌: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఒకరు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతుడు జిరాయత్ నగర్ కాలనీకి చెందిన రవిగా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.