Telangana

News September 19, 2024

సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.

News September 19, 2024

MBNR: 15 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేరు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 5, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో‌‌ పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

News September 19, 2024

నల్గొండ: వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

image

నల్గొండకి చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలిని హిందూపూర్ స్మశాన వాటిక వద్ద కందుల కృష్ణ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున అత్యాచారం చేశాడని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడని తెలిపారు. బాధితురాలు కూతురితో విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News September 19, 2024

MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.

News September 19, 2024

HYD: నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు

image

కొవిడ్ సమయంలో మూడు ఏళ్ల పాటు శ్రమించి వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వైద్యుల సేవలను గుర్తిస్తూ ICMR ప్రశంసా పత్రాలను అందజేసింది. వీరిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నవాల్ చంద్ర, YSN రాజు, సుబ్బలక్ష్మి, జమునా హుస్సేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఉమాబాల, తేజా, పద్మజా, MVLN రామ్మోహన్ ఉన్నారు.

News September 19, 2024

HYD: నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు

image

కొవిడ్ సమయంలో మూడు ఏళ్ల పాటు శ్రమించి వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వైద్యుల సేవలను గుర్తిస్తూ ICMR ప్రశంసా పత్రాలను అందజేసింది. వీరిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నవాల్ చంద్ర, YSN రాజు, సుబ్బలక్ష్మి, జమునా హుస్సేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఉమాబాల, తేజా, పద్మజా, MVLN రామ్మోహన్ ఉన్నారు.

News September 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} నేటి నుంచి పోలీసులకు ఫైరింగ్ శిక్షణ
∆} బూర్గంపహాడ్‌లో అఖిలపక్ష సమావేశం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

News September 19, 2024

సిద్దిపేట: అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటిన చింతమడక విద్యార్థినిలు

image

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింతమడక జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు సత్తా చాటారు. 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్-1480 మీటర్ల, జెళ్ల అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఈనెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని HM కొత్త రాజిరెడ్డి తెలిపారు.
-CONGRATS

News September 19, 2024

HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.

News September 19, 2024

HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.