India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.
నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని సీపీ సాయి చైతన్య శనివారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే లో చూడాలని పోలీసులకు ఆదేశించారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.
NLG జిల్లాలోని MEPMA, హార్టికల్చర్ & సెరికల్చర్ డిపార్ట్మెంట్, DEO పరిధిలోని మోడల్ స్కూల్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు ఔట్ సోర్సింగ్ సేవలు అందించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో ఎంపానెల్ అయిన ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారన్నారు.
రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.
వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
పాలేరు నియోజకవర్గంలో రైతులకు యూరియా పంపిణీ PACS కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారానే జరుగుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సెప్టెంబర్ 3 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 2500 ఎకరాలకు ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వినాయకచవితి నవరాత్రుల వేళ లడ్డూ దొంగల బెడద పెరిగింది. మీర్పేట PS పరిధి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్ కాలనీలో ఏకంగా 4 మండపాల్లో గణపతి లడ్డూలను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్కూటీపై వచ్చిన యువకులు అదును చూసి చోరీ చేశారు. దీనిపై స్థానికులు PSలో ఫిర్యాదు చేశారు. మండపంలో నిద్రించే వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అనుసరించి ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులను పాటిస్తున్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు
Sorry, no posts matched your criteria.