India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారుల పాత్ర కీలకమైందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో HYD పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన సంఘ రాష్ట్రస్థాయి సదస్సులో కోదండరాం ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,238 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. MBNR-70.21శాతం, GDWL-87.80 శాతం, WNPT-95.36శాతం, NGKL-93.40 శాతం, NRPT-76.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సీతారామప్రాజెక్టు ట్రయల్రన్ విజయవంతంతో మాజీ సీఎం కేసీఆర్ ఉక్కుసంకల్పం నెరవేరినట్లయిందని MLC తాతామధు తెలిపారు. ఖమ్మంలోని శుక్రువారం ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఇన్నాళ్లు కుంభకోణమని నిందించిన వారు, ఇప్పుడెలా ట్రయల్రన్ను ప్రారంభించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.
జనగామ జిల్లాను ఆదర్శవంతమైన మహిళా శక్తి దిశగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేటులో మండలాల సీసీలు, ఏపీఎంలు, వీవోలకు మహిళా శక్తి పథకంపై కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి కల్పించాలని వారిని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.
Sorry, no posts matched your criteria.