India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలకగా.. ఏసీ 341 రకం మిర్చి రూ.16,500 పలికింది. వండర్ హాట్(WH) మిర్చికి రూ.17,000 ధర వచ్చింది. కాగా, నిన్నటితో పోలిస్తే 341, వండర్ హాట్ మిర్చి ధరలు రూ.500 తగ్గాయి. తేజా మిర్చి ధర అలానే ఉంది.
నల్గొండలోని NG కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఉపేందర్ తెలిపారు. తెలుగు-2, వాణిజ్యశాస్త్రం-3, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-3′ కంప్యూటర్ సైన్స్\అప్లికేషన్స్-6, డాటా సైన్స్-1 గణితశాస్త్రం-2, స్టాటస్టిక్స్-1, బయోటెక్నాలజీ-1 సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 160 వాహనాలు తమ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీధుల్లో వదిలేసిన బైక్లను అంబర్పేటలోని హెడ్ క్వార్టర్స్లో భద్రపరిచారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూయించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే రూల్స్ ప్రకారం వేలం వేస్తామని స్పష్టం చేశారు. SHARE IT
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని HP పెట్రోల్ పంప్ వెనకాల భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య శివలీల భర్త శివపై కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాచకొండ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 160 వాహనాలు తమ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీధుల్లో వదిలేసిన బైక్లను అంబర్పేటలోని హెడ్ క్వార్టర్స్లో భద్రపరిచారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూయించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే రూల్స్ ప్రకారం వేలం వేస్తామని స్పష్టం చేశారు. SHARE IT
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మహీదర వెంచర్లో కార్యకలాపాలు నిర్వహించడం కోసం విశాల్ (8) అనే చిన్న పిల్లవాడు వెళ్లగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి చనిపోయాడు. బిహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి చిన్నారి కుటుంబం పటాన్ చెరువుకు వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడు రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. సికింద్రాబాద్ జీర్పీ పోలీసుల ప్రకారం NZB జిల్లా కోటగిరికి చెందిన పెద్దరాజు(69) తిరుపతి వెళ్లి వస్తానంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాగా రైలులో చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. గురువారం పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీ శక్తి క్యాంటీన్లను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించనుంది. దీంతో నల్గొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 103 మీ సేవ కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు బలమైన గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసినట్లు పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నియామకపత్రం అందుకున్నప్పటికీ ఓ అభ్యర్థిని ఉద్యోగానికి దూరమైంది. కరీంనగర్ (D) గంగాధర (M) నారాయణపూర్కు చెందిన భానుప్రియ గురుకులంలో PGT గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికై నియామకపత్రం అందుకుంది. 40% వైకల్యం ఉన్నవారు దివ్యాంగులుగా అర్హులు కాగా ఆమెకు 68% ఉన్నట్లు సదరం క్యాంపులో గుర్తించారు.అయితే తాజా వైద్య పరీక్షల్లో 39% వైకల్యం ఉందని తేలడంతో ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ తేల్చారు. న్యాయం చేయాలని కోరుతోంది.
Sorry, no posts matched your criteria.