India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోక్సో కేసులో నేరస్థుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లాజడ్జి ఎండీ రఫీ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాలు.. శంషాబాద్లోని సిద్ధార్థనగర్కు చెందిన నరసింహ నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలికను ప్రేమపేరుతో వంచించాడు. వెళ్లి చేసుకుంటానని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో 2023 సెప్టెంబర్ 16న ధన్వాడ పీఎస్లో కేసు నమోదు చేశారు.
జలమండలి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత ఎండీగా విధులు నిర్వహించిన సుదర్శన్ రెడ్డి వద్ద నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశోక్ రెడ్డికి ఇప్పటికీ జలమండలితో మంచి అనుబంధం ఉంది.
జలమండలి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత ఎండీగా విధులు నిర్వహించిన సుదర్శన్ రెడ్డి వద్ద నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశోక్ రెడ్డికి ఇప్పటికీ జలమండలితో మంచి అనుబంధం ఉంది.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. బుధవారం HYD నల్లకుంటలో ఆమె మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జులై 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.SHARE IT
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. బుధవారం HYD నల్లకుంటలో ఆమె మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జులై 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
SHARE IT
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులపై HYD, RR, MDCL, VKB జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీలు, ప్రైవేట్ దవాఖానాలకు రోగులు పోటెత్తుతున్నారు. గడిచిన 25 రోజుల్లో ఫీవర్ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధితో 15 మంది చేరారు. ఇక HYDలో మే నెలలో 39, జూన్ 25వ తేదీ వరకు 35 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు శుభ్రత పాటించాలన్నారు. SHARE IT
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులపై HYD, RR, MDCL, VKB జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీలు, ప్రైవేట్ దవాఖానాలకు రోగులు పోటెత్తుతున్నారు. గడిచిన 25 రోజుల్లో ఫీవర్ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధితో 15 మంది చేరారు. ఇక HYDలో మే నెలలో 39, జూన్ 25వ తేదీ వరకు 35 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు శుభ్రత పాటించాలన్నారు. SHARE IT
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెలరోజులపాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గోల్కొండ కోటకు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెలరోజులపాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గోల్కొండ కోటకు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో పరిశీలించారు. పార్కులో చేపట్టిన పనులు, ఫొటో ఎగ్జిబిట్లను సీఎం తిలకిస్తారని చెప్పారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.