Telangana

News September 19, 2024

NZB: పాము కాటేస్తోంది.. జర భద్రం..!

image

వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.

News September 19, 2024

HYD: గణనాథుడిని దర్శించుకున్న KTR

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా HYD కుషాయిగూడలోని TSIIC కాలనీలో BRS రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ వారు భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుడి ప్రత్యేక పూజలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఉప్పల్ నియోజకవర్గ MLA బండారి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, BRS పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News September 19, 2024

HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!

image

హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు‌ తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.

News September 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.

image

> MLG: ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
> WGL: గణపతి నిమర్జనం ట్రాక్టర్ ను ఢీకొన్న అంబులెన్స్
> MLG: అడవి పందులను హతమార్చిన ముగ్గురి అరెస్ట్
> JN: ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మరంలో మంటలు
> MLG: గడ్డి మందు తాగి యువకుడు మృతి
> MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి
> MLG: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
> VKP: విష జ్వరంతో మహిళ మృతి
> WGL: నర్సంపేటలో ఉరి వేసుకుని ఒకరి మృతి

News September 19, 2024

HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!

image

హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు‌ తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.

News September 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ బీర్పూర్ మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల సీజ్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి. @ ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా వాసి. @ ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని జగిత్యాల కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి.

News September 19, 2024

బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టు

image

నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.

News September 19, 2024

యాదాద్రి ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు హనుమంత్‌తో ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.

News September 18, 2024

దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష

image

ప్రముఖ ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News September 18, 2024

నిర్దేశించిన గడువులోగా రైస్ డెలివరీ పూర్తి చేయాలి: కలెక్టర్

image

నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ సీజన్‌లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని  తప్పనిసరిగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో  సమీక్ష నిర్వహించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.