India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.
ఇంట్లో ఫంక్షన్ ఉంటే HYDలో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువుకు వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్లో కనీసం 2 ఫంక్షన్ హాల్స్ నిర్మించి, తక్కువ ధరకు ఉంచేలా చూడాలని కోరుతున్నారు.
వచ్చే నెల 6న జరిగే గణపతి శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్టాటిక్ క్రేన్లు: 134, మొబైల్ క్రేన్లు: 269, హుస్సేన్సాగర్ వద్ద పడవలు 9, డీఆర్ఎఫ్ 16 టీములు, గజ ఈతగాళ్లు: 200, గణేశ్ యాక్షన్ టీమ్స్: 160, పారిశుద్ధ్య కార్మికులు 14,486 మంది, మినీ టిప్పర్లు: 102, జేసీబీలు 125, స్వీపింగ్ యంత్రాలు 30, మొబైల్ టాయిలెట్స్ 309, లైటింగ్ పాయింట్లు 56,187, వైద్య శిబిరాలు 7 ఏర్పాటు చేశారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
SRSP పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 1084.5 అడుగులు, 58.357 టీఎంసీల వద్ద నీరు నిలువ ఉంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతీ, లక్ష్మి మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసి ట్రాక్స్ దెబ్బతిన్న కారణంగా పలు రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- నాగర్ సోల్, నిజామాబాద్- కాచిగూడ, నాందేడ్- మేడ్చల్, కాచిగూడ- కరీంనగర్, కాచిగూడ- మెదక్, సికింద్రాబాద్- సిద్దిపేట, కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, సిద్దిపేట- సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు.
వాతావరణ మార్పులతో నగరానికి సుస్తీ చేసింది. దీంతో ప్రజలు ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజుకు 2,200 నుంచి 2,500 మంది చికిత్సకు వస్తున్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 400- 500 OP ఉండగా ఇప్పుడు రోజుకు 1,100- 1,300 మంది వస్తున్నారు. ఉస్మానియాలో సాధారణ OP 1,100 నుంచి 1,200 ఉండగా ఇప్పుడు 1,600-1,800 మంది వస్తున్నారు. ఒక్కో బస్తీ దవాఖానాకు 70- 90 మంది వస్తున్నారు.
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, డీఈడీ, ఫార్మసిటికల్ కళాశాలలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. దీంతో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే వారి స్టడీ సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కొంతమంది విద్యార్థులు సదరు కళాశాలలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
టీచర్స్ డే.. ఉపాధ్యాయులు ఉప్పొంగే దినోత్సవం. ఈ వేడుకలో ఉపాధ్యాయుల ఆనందమే వేరు. ఈ అవార్డులు పొందిన టీచర్లకు ఆరోజు అభినందనలు వెల్లువెత్తుతాయి. ఇలాంటి వేడుకకు సీఎం వస్తే.. ఆ ఫీలే వేరు ఇది సగటు టీచర్ ఆనందం. ఎప్పుడో 2014లో రవీంద్రభారతిలో జరిగిన వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఈ సెప్టెంబరు 5న రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారు.
హస్తినాపూర్ వాసులు గణేశుడికి వేసిన 5తులాల బంగారంతోనే శివారు తుర్కయంజాల్ మాసబ్చెరువులో నిమజ్జనం చేశారు. విషయాన్ని గుర్తించి జరిగిన విషయం మున్సిపల్ నోడల్ అధికారులు వినయ్, శ్రీధర్రెడ్డికి చెప్పారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దింపగా.. JCB సహాయంతో శ్రమించి విగ్రహాన్ని బయటికి తీశారు. 5 తులాల బంగారాన్ని వారికి అందించారు. పోయిందనుకున్న బంగారం తిరిగి దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్.
Sorry, no posts matched your criteria.