India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు చెల్లించిన రుణాలకు వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేసింది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.273.55 కోట్లను మహిళా సంఘాల ఖాతాల్లో వేశారు. అతివలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఏటా ప్రణాళిక ప్రకారం రుణాలు అందిస్తుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,187 విద్యాలయాలకు ఉచిత విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించినప్పటికీ జీరో బిల్లులు అందజేయనున్నారు. ఉచిత విద్యుత్తు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అమలు కోసం పోర్టల్ అనుసంధానం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. ములుగు మండలం కొక్కొండకు చెందిన మహేశ్వరి(22) నూజివీడు కంపెనీలో పనిచేస్తూ విజయ్ను లవ్ చేసింది. సోమవారం రాత్రి మహేశ్వరి అక్కతో విజయ్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఆమెకు పంపాడు. దీంతో తమ ప్రేమ వ్యవహారం పేరెంట్స్కు తెలిసిందని మనస్తాపంతో యువతి ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
మామను గొడ్డిలితో నరికి చెరువులో పడేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ HNK జడ్జి అపర్ణాదేవి తీర్పుచ్చారు. నడికూడ (M) కంఠాత్మకూరు వాసి ఎల్లయ్య(55)తన కుమార్తె స్వాతిని వెంకటేశ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 2020 OCT 6న ఎల్లయ్య, వెంకటేశ్ హసన్పర్తి చెరువుకట్టపైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరగగా వెంకటేశ్ గొడ్డలితో నరికి మృతదేహాన్ని చెరువుతో పడేశాడు.
హుజూరాబాద్ (M) ఇప్పల నర్సింగాపూర్కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన నాగరాజుతో సంబంధం పెట్టుకుందని అతడి భార్య ఉమ, సోదరి తిరుమల, రాజ్కుమార్ ఆమెపై దాడి చేశారు. అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ పేర్కొన్నారు.
నగరంలో నూతనంగా 2 బస్పాస్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్స్టాప్లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది. SHARE IT
నగరంలో నూతనంగా 2 బస్పాస్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్స్టాప్లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది.
SHARE IT
పాస్ పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతుంది ఇక సేవలు పొందడం సులువని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2వ పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018లో విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆరేళ్లు ధాటినా సేవా కేంద్రం ఏర్పాటు ఉత్తర్వులకే పరిమితమైంది. MP షెట్కార్ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ కాలేదని మనస్తాపంతో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగాయి. పోలీసుల వివరాలు.. అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పవన్(17) ఇంటర్ ఫస్టియిర్లో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. నాగర్కర్నూల్కు చెందిన రాకేశ్ తరగతి గదిలో కూల్ డ్రింక్స్లో పురుగు మందు కలిపి తాగగా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Sorry, no posts matched your criteria.