India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. వక్ఫ్ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించిందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,500 పలికింది. అలాగే పసుపు(కాడి) క్వింటాకి ధర రూ.14,117 వచ్చింది. మరోవైపు మక్కలు(బిల్టీ) క్వింటా ధర రూ.2,365 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.
టేకులపల్లి మండలం సంపత్నగర్కు చెందిన కుడితేటి రమేశ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో రమేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంటలో 1,046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ బృందంలో రమేశ్ సభ్యుడు. సోమవారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.
గత వారం పదిరోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనాలు సతమతమవుతున్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ మేరకు రేపు ఎల్లుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఖమ్మం పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎండీ షౌకత్ అలీ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమిషనరేట్లో ఏఎస్ఐ షౌకత్ అలీ కుటుంబానికి మంజూరు అయిన రూ.8 లక్షల ఎక్స్గ్రేషియో చెక్కును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వారంలో ఒక్కరోజైనా రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే, అనంతగిరి హిల్స్ బెస్ట్ ప్లేస్. వీకెండ్ వచ్చిందంటే చాలు HYD, కర్ణాటక నుంచి వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. చుట్టూ పచ్చని కొండలు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మూసీ నది పుట్టుక ఈ అడవుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టూర్ వెళ్లాలంటే వరుసగా లీవ్లు పెట్టే అవసరం లేదు. ఒక్కరోజులోనే అనంతగిరిని చుట్టిరావొచ్చు.
SHARE IT
Sorry, no posts matched your criteria.