Telangana

News June 24, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు: భట్టి విక్రమార్క
✒DSCలో పోస్టులు పెంచాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా B.ed,Ded అభ్యర్థుల
నిరసన
✒NGKL:గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
✒ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌.. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక
✒ఇంటర్ ఫలితాలు.. గద్వాల ఫస్ట్.. నారాయణపేట లాస్ట్
✒ఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం
✒MBNR:25 నుంచి జాతీయ నెట్ బాల్‌కు శిక్షణ
✒గృహ జ్యోతి పథకాన్ని దరఖాస్తు చేసుకోండి: MPDO

News June 24, 2024

HYD: ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

image

రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.

News June 24, 2024

HYD: ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

image

రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు

News June 24, 2024

NZB: రైల్వేట్రాక్.. ఆత్మహత్యలకు అడ్డా

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రోజురోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, బాసర స్టేషన్లు వస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 20 వరకు 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 52 మంది పురుషులైతే.. ఇద్దరు మహిళలు ఉన్నారు. రైల్వే అధికారులు గ్రామాల సమీపంలో కొన్ని కి.మీ పరిధిలో పర్యవేక్షణ పెడితే చాలా వరకు బలవన్మరణాలను నివారించవచ్చు.

News June 24, 2024

28న వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

వరంగల్ నగరంలో ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

News June 24, 2024

నాగర్‌కర్నూల్: మహిళపై దాడి ఘటనలో కొత్త కోణం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళా ఈశ్వరమ్మపై దాడి ఘటనలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఈశ్వరమ్మపై దాడికి ముందే 20 రోజుల క్రితం ఆమె చిన్నమామ నాగన్న అనుమానాస్పదంగా మృతిచెందారు. భూమి విక్రయానికి అడ్డుపడ్డాడని నాగన్నను కొందరు హత్య చేసి పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేయించారని స్థానికంగా టాక్. తాజాగా దాడి నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో నాగన్న మృతిపైనా పోలీసులు విచారణ చేపట్టారు.

News June 24, 2024

శ్రీశైలంలో సన్నిధిలో డీప్యూటీ సీఎంతో పాలమూరు ఎమ్మెల్యేలు

image

శ్రీశైలం మల్లికార్జున స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేయించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

News June 24, 2024

సిద్దిపేట: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దండు దుర్గేష్(34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న దుర్గేశ్ ఈనెల 13న భార్య పూర్ణిమతో గొడవ పడ్డాడు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన దుర్గేశ్ ఈనెల 14న పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News June 24, 2024

కుంటాల: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఓలకు చెందిన బొమ్మన ప్రకాష్ (35) లెఫ్ట్ పోచంపాడు గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా మద్యానికి బానిసై
మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య రీనా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రజినీకాంత్ తెలిపారు.

News June 24, 2024

కడుపునొప్పి భరించలేక యువకుడి సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక యువకుడు ఇంట్లో ఉరేసుకుని మృతిచెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని తుంకీపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి జ్ఞానేశ్వర్ (24) ఆటో డ్రైవర్ సోమవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.