Telangana

News June 24, 2024

అగ్నివీరులుగా నల్గొండ NG కాలేజీ స్టూడెంట్స్ 

image

నల్గొండ NG కాలేజీ స్టూడెంట్స్ సత్తాచాటుతున్నారు . డిగ్రీ స్థాయిలోనే అగ్నిపథ్‌కు ఎంపికై నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశాన్ని పొందుతున్నారు.  ఎన్సీసీ విద్యార్థులు ఉమేష్, చరణ్, మహేష్, కార్తీక్, కళ్యాణ్ లాజర్, ఎం.మహేష్ గతేడాది OCTలో అగ్నిపథ్‌కు ఎంపికయ్యారు. ఏడు నెలల పాటు తమిళనాడులో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల వీరు జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీలో సైనికులుగా బాధ్యతలు స్వీకరించారు. 

News June 24, 2024

HYD: పెళ్లి చూపులు.. అంతలోనే విషాదం!

image

పెళ్లి చూపులకు‌ ప్రయాణమైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జూబ్లీహిల్స్ PS పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లి వాసి శివశంకర్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో శనివారం రాత్రి బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్ 1 వద్ద ఓ టిప్పిర్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు.

News June 24, 2024

అమ్రాబాద్: బతికుండగానే చంపేశారు

image

ఓ వృద్ధురాలు బతికి ఉండగానే ఆమె పేరుపై ఫేక్ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి ఆమె ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ ఘటన అమ్రాబాద్ మండలంలో జరిగింది. కుమ్మరోనిపల్లికి చెందిన సాయిలమ్మకు 1.08 గుంటల పట్టా భూమి ఉంది. డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె పేరు మీద భూమిని పలువురు పట్టా చేసుకున్నారు. రైతుబంధు డబ్బులు పడకపోవడంతో ఆమె అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా విషయం బయటకు తెలిసింది.

News June 24, 2024

జనగామ: వివాహేతర సంబంధం.. ఆపై హత్య

image

వివాహేతర సంబంధం పెట్టుకొని ఆపై మహిళను హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. సుబేదారి CI వివరాల ప్రకారం.. స్టే.ఘ వాసి మంజులకు, HNK వాసి అశోక్‌తో పెళ్లైంది. కాగా వీరి మధ్య గొడవలు రావడంతో సర్దిచెప్పడానికి వచ్చిన పంచాయితీ పెద్ద మనిషి వెంకటస్వామి ఆమెను లొంగదీసుకొని 2ఏళ్లగా సహజీవనం చేస్తున్నాడు. ఈనెల 21న మంజుల, వెంకటస్వామి ఫోన్‌లో గొడవ పడ్డారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

News June 24, 2024

వ్యవసాయ పనుల్లో నిమగ్నం

image

రుతు పవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పొలాల దుక్కులు చదును చేసి విత్తనం నాటేందుకు సిద్ధంగా ఉన్న రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1,18,286 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా, నీటి వసతులు ఉన్న చోట్ల 8,512 ఎకరాల్లో వరి నాట్లు వేశారు.

News June 24, 2024

బాన్సువాడ: గొడ్డలితో నరికి.. సెప్టిక్ ట్యాంకులో పడేశారు

image

మామతో కలిసి ఓ మహిళ <<13495824>>భర్తను హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. CI కృష్ణ వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన రాములు(40) తాగివచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణతో గొడవపడేవాడు. అది భరించలేక రాములును వారిద్దరూ కలిసి ఈనెల 9న గొడ్డలితో నరికి హత్య చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. రెండు రోజుల తర్వాత ఇంటి ఎదుట గొయ్యి తీసిపూడ్చిపెట్టారు. అతడి బావ అయిన శ్రీనివాస్‌ వారి కుటుంబీకులను అడగడంతో విషయం బయటపడింది.

News June 24, 2024

హైదరాబాద్‌ శివారులో మాజీ MPTC హత్య

image

హైదరాబాద్ శివారు‌లో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్‌కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PS‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్‌ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

హైదరాబాద్‌ శివారులో మాజీ MPTC హత్య

image

హైదరాబాద్ శివారు‌లో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్‌కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PS‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్‌ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

వనపర్తి: తెల్లవారితే పెళ్లిచూపులు.. అంతలోనే

image

మరుసటి రోజు ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్ పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో బుల్లెట్ బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు.

News June 24, 2024

రక్తంతో MLA యశస్వినిరెడ్డి చిత్రాన్ని గీసిన యువకుడు

image

దేవరుప్పుల మండలానికి చెందిన యువకుడు లోడంగి అశోక్ తన రక్తంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేకు చిత్రపటాన్ని అశోక్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.