India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఇంట్లో చెబుతాడన్న భయంతో కమర్ బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్కు చెందిన ఆశిష్, దీపక్ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా ప్రధాన జడ్జి, DLSA ఛైర్మన్ జస్టిస్ కర్ణకుమార్ అన్నారు. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘మధ్యవర్తిత్వం ఫర్ ద నేషన్’ వేళ మాట్లాడారు. కేసులు వేగంగా, తక్కువ ఖర్చు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఉత్తమ మార్గమన్నారు. పెండింగ్ కేసులు తగ్గి, న్యాయవ్యవస్థ వేగవంతమవుతుందన్నారు. DLSA కార్యదర్శి శ్రీవాణి ఉన్నారు.
యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి YV రాజుకు అరుదైన గౌరవం లభించింది. 2025 సంవత్సరంలో “ఆత్మ నిర్భర్ పంచాయతీ” విభాగంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని YV రాజుకు ఆహ్వానం అందగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా 24/7 తమ సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు 150 పని చేస్తున్నాయి. 3,565 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 9 బోట్లను సిద్ధం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.
భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వేడుకలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ కొంగరకలాన్లోని కలక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 61 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అర్జీల ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.