India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగర వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గణపతి నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు,బందోబస్తు గూర్చి పరిశీలించారు.చార్మినార్, బాలాపూర్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సిపిలతో కలిసి పరిస్థితులు పరిశీలించారు. నిమజ్జనం, ఊరేగింపు సాఫీగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పర్యటనలో సీపీలు సుధీర్ బాబు, సివి ఆనంద్, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.
రాష్ట్ర సింగరేణి ఉద్యోగులకు CMD బలరాం శుభవార్త చెప్పారు. HYD లక్డీకపూల్ వద్ద ఉన్న సింగరేణి భవన్లో మాట్లాడుతూ.. త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్ఫర్ పాలసీ తెస్తామన్నారు.బదిలీ, విజ్ఞప్తులను ఆన్ లైన్లో స్వీకరించేందుకు యాప్ రూపొందిస్తామన్నారు. రెండు నెలల్లో సింగరేణిలో ఈ-ఆఫీస్ ప్రారంభిస్తామని, గనుల్లోని కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.
గ్రేటర్ HYD ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది. రోజూ 10-15 నిమిషాల పాటు వేడి చేసి, చల్లార్చి గురువెచ్చని నీటిని తాగితే సగం రోగాలు దూరమవుతాయని తెలిపింది. నీటి కలుషితంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బ్రష్ చేసేటప్పుడు, వంట వండేటప్పుడు, కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు వేడిచేసిన నీటితో కడగటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. RR, MDCL, VKB ప్రజలు సైతం పాటించాలని డాక్టర్లు సూచించారు.
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.
నిమ్స్లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గత రెండు,మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై నాయకులు వాడుతున్న పదజాలంపై రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషనర్, కోర్టులు ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దుచేసి, మాటలను బట్టి 10 నుంచి 20 ఏళ్లు రాజకీయానికు అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది
HYDలో ఉమెన్ ఎంపవర్మెంట్పై సికింద్రాబాద్లోని డిఫెన్స్ కాలేజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారత కోసం తీసుకున్న అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. డాక్టర్స్ సువర్ణ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక భరోసాపై మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
Sorry, no posts matched your criteria.