RangaReddy

News December 2, 2024

ఓయూలో ఈనెల 11 నుంచి పరీక్షలు

image

ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఓయూ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు.

News December 2, 2024

HYD: సికింద్రాబాద్ పేరు ఎలా వచ్చిందో..తెలుసా.?

image

HYDలోని ప్రస్తుత సికింద్రాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అనే పదానికి అర్థం ఆర్మీ క్యాంప్. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఉండేవారు. మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరు మీద 1806లో లష్కర్ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’ ప్రాంతంగా పేరు మార్చారని చరిత్ర చెబుతోందని చరిత్రకారులు మురళి తెలిపారు.

News December 2, 2024

ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్

image

ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు రింగ్ రోడ్డు వద్ద ఉదయం 4:19 గంటలకు మొదటి ఆర్టీసీ బస్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో మరో సూపర్ లగ్జరీ బస్సు సైతం అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. భువనగిరి, మోత్కూరు, తొర్రూరు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 2, 2024

HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా

image

నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్‌‌రావు ఆరా తీశారు. అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితర నాయకులు ఉన్నారు.

News December 1, 2024

HYDలో పుష్ప-2 ప్రీ రిలీజ్ EVENT.. ట్రాఫిక్ ఆంక్షలు!

image

HYDలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో డిసెంబర్ 2న సా.4 నుంచి రా.10 వరకు అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, మోతీనగర్, బోరబండ, జూబ్లీహిల్స్, మైత్రివనంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. జానకమ్మ తోటలో జనరల్ పబ్లిక్ వాహనాల పార్కింగ్ కాగా సవేరా, మహమ్మద్ ఫంక్షన్ హాళ్లలో ఓన్లీ 4 వీలర్ పార్కింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.

News December 1, 2024

HYD: రహదారులపై మతాల చిహ్నాలు తొలగించాలి: సంఘ సేవకులు

image

రహదారులపై వివిధ మతాల చిహ్నాలు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడి నుంచి తరలించాలని ప్రముఖ సంఘ సేవకులు గంజి ఈశ్వర్ లింగం, టీ.రమేశ్ కోరారు. సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రహదారులపై ఆటంకాలు, ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం కమలానగర్‌లో ఆదివారం నిర్వహించారు. కోమటిరవి, యాదగిరిరావు, కర్రం మల్లేశం ఉన్నారు.

News December 1, 2024

HYD: వాహనాలపై ఇనుప చువ్వలు తరలిస్తున్నారా? జాగ్రత్త..!

image

వాహనాలపై ఇనుప చువ్వలు తరలించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని HYD ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇటీవల కూకట్‌పల్లి JNTUH మార్గంలో వాహనంపై నుంచి ఇనుప చువ్వలు కింద పడ్డాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. కానీ.. వాహనంపై నుంచి ఇనుప చువ్వలు వేరే వ్యక్తులపై పడితే తీవ్ర ప్రమాదం జరిగేదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News December 1, 2024

HYD: టార్గెట్ అవే.. దొంగలు పడుతున్నారు జాగ్రత్త.!

image

HYDలో చొరబడ్డ మధ్యప్రదేశ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా మహిళలు, శుభకార్యాలు, ఫంక్షన్ హాళ్లు, జనసంద్రం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతోంది. అందరిలాగే లగేజీతో హాజరై అన్నీ కొట్టేస్తున్నారు. అందర్నీ ఆశీర్వదించి, భోజనాలు చేసే సమయంలో మెళ్లగా మహిళలను టార్గెట్ చేసి ఆభరణాలను సైతం ఎత్తుకెళ్తున్నారు. చివరికి పర్సనల్ పాకెట్లు సైతం ఖాళీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త..!

News December 1, 2024

RR: లగచర్ల ఘటన.. పోలీస్ స్టేషన్ మంజూరు..!

image

VKB దుద్యాల్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లగచర్ల, పోలేపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. NOV 11న లగచర్లలో అధికారులపై జరిగిన ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.తాజాగా నోటిఫికేషన్ సైతం జారీ అయింది. దుద్యాల్ గేట్ సమీపాన ప్రభుత్వ భూమిని సైతం పరిశీలించారు.

News December 1, 2024

BREAKING: ఏఈఈ నికేశ్‌ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

image

ఇరిగేషన్ ఏఈఈ నికేశ్‌ కుమార్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఏసీబీ అధికారులు నికేశ్ కుమార్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం నికేశ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.