India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిసెంబర్ 2న బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం భవన సముదాయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక మేయర్ నీలా గోపాల్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సభా స్థలి, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
HYD మహానగరంలో చాలామంది చలిలో వణుకుతూ ఫుట్పాత్పైనే పడుకుంటున్నారు. వారు చలికి ఇబ్బంది పడకూడదని జీహెచ్ఎంసీ గతంలో దుప్పట్లను పంపిణీ చేసేది. అయితే ఈసారి అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. కృష్ణానగర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, ఇందిరా నగర్, రెయిన్బో ఆస్పత్రి, సాగర్ సొసైటీ, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట ప్రాంతాల్లో వందల మంది ఫుట్పాత్పై చలిలో అవస్థలు పడుతున్నా పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు GHMC సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని రూ.8,600 కోట్లతో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట బడ్జెట్ ప్రతిపాదనపై మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించి, ఆ తర్వాత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా, 2024-25 బడ్జెట్ రూ.7,937 కోట్లు. దీనిపై మీ కామెంట్?
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
సైకో కిల్లర్ రాహుల్ కేసులో భయంకర నిజాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న ఓ యువతిని హత్యాచారం చేసిన కేసులో వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేసి అదే మృతదేహాం పక్కన నిద్రించే అలావాటు రాహుల్కు ఉందని గుర్తించారు. సదరు యువతి(19)ని తోటలో చంపిన తర్వాత రెండోసారి అత్యాచారం చేశాడన్నారు. అయితే, <<14729624>>సికింద్రాబాద్-మణుగూరు<<>> రైలులో రమణమ్మను చంపిన ఈ నరహంతకుడిని HYD తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్సుఖ్నగర్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి MPచామల కిరణ్ కుమార్ రెడ్డి, R&B ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి వారు భువనగిరి పరిధిలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
వీధుల్లో లేడీస్ సూట్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా హైదరాబాద్కు వచ్చిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు నగరానికి వచ్చారని పలువురు సోషల్ అకౌంట్లలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలను వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.