RangaReddy

News November 26, 2024

HYD: గాంధీ భవన్‌లో ఇంటలెక్చువల్ కమిటీ సమావేశం

image

నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వీ.హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.

News November 26, 2024

HYD: నెమళ్ల సంఖ్య గతేడాది 565.. మరి ఈ ఏడాది..?

image

HYD నగరంలో పేరుగాంచిన KBR పార్కులో నెమళ్ల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చేనెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే. జాతీయ పక్షులు పార్కులో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ వివరాలను డిసెంబర్ 3వ తేదీ ప్రకటిస్తామని పార్క్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది KBR పార్కులో 565 నెమళ్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

News November 26, 2024

HYD: ‘కేంద్రం సొంత భావాలను అమలు చేస్తుంది’

image

సమగ్ర కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది. కేవలం రాహుల్ గాంధీ కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి తమ సొంత భావాలను అమలు చేస్తుంది’ అని మండిపడ్డారు.

News November 26, 2024

హైదరాబాద్‌ను కాపాడుదాం: వామపక్షాలు

image

మతోన్మాద విద్వేష శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుందామని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బాగ్‌లింగంపల్లిలోని SVKలో “మతోన్మాద, విద్వేష శక్తుల నుంచి HYDను కాపాడుకుందాం” అని వామపక్షాల నగర సదస్సును నిర్వహించారు. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మత ఘర్షణలు జరగాలని కొన్ని మతతత్వ శక్తులు కోరుకుంటునట్లు ఉందని CPM నేత శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

News November 26, 2024

HYD: 10 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అనుమతి

image

హైదరాబాద్‌ వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 10 రోజుల్లోనే ఇండ్ల నిర్మాణ అనుమతులు పొందవచ్చు. తాజాగా HMDA ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా పెండింగ్ అప్లికేషన్లకు వారం రోజుల్లోనే క్లియరెన్స్ ఇవ్వనున్నారు. గతంలో అనుమతుల కోసం 2 నుంచి 3 నెలల సమయం పట్టేదని.. ప్రజల కోసం ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు ‘తెలంగాణ కాంగ్రెస్’ ట్వీట్ చేసింది.
SHARE IT

News November 26, 2024

HYDలో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో‌ KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్‌ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.

News November 26, 2024

HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్‌న్యూస్

image

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్‌ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT

News November 25, 2024

సూరారంకాలనీ: శివుడికి పెరుగన్నంతో అలంకరణ

image

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సూరారం కాలనీ, రామాలయంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి భక్తులు అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడాయి. ఇక్కడి శివలింగం అన్నం, పెరుగుతో భక్తులకు దర్శనమిచ్చారు. దీన్నే సాయంత్రం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

News November 25, 2024

HYD: కార్మికులుగా మారుతున్న పేదల పిల్లలు

image

రెక్కాడితేగానీ డొక్కాడనివి నిరుపేదల జీవితాలు. పొట్టకూటి కోసం శ్రమను నమ్ముకుని ఏదో ఓ పని చేస్తుంటారు. అయితే చాలా మంది తమ చదవుకునే పిల్లలను వెంట తీసుకెళ్తూ బాలకార్మికులుగా మార్చడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి దృశ్యాలు HYD మహానగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి పేదల పట్ల సానుకూలంగా స్పందించి  ఉన్నత చదువులతో జీవితానికి బాటలు వేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

News November 25, 2024

HYD: టూర్ వెళ్లాలంటే.. లగ్జరీ బస్సు

image

రాష్ట్ర ప్రభుత్వం 21 సీట్లతో ఉండే ఏసీ లగ్జరీ మినీబస్, 9 సీట్లు నాలుగు బెర్తులు కలిగిన ఏసీ క్యారవాన్ వెహికల్ సేవలను గత ఏడాది కాలంలో అందుబాటులోకి తెచ్చిందని తెలంగాణ టూరిజం అధికారులు తెలిపారు. HYD, RR, MDCL జిల్లాలకు చెందిన ప్రజలు కుటుంబం మొత్తం కలిసి టూర్లకు వెళ్లేందుకు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవచ్చని, ఇందుకోసం 9848540371కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.