India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘మధురానగర్లోని మా ఇల్లు బఫర్ జోన్లో లేదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 44 ఏళ్ల క్రితం మా నాన్న కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాను. 25 ఏళ్ల క్రితం చెరువులో కృష్ణకాంత్ పార్క్ నిర్మించారు. మా ఇంటికి ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. మధ్యలో వేలాది ఇండ్లు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు.
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు ఈ నెల 28 వరకు పొడిగించినట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 25 కాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు అయినందున చాలా మంది డీడీలు తీయలేక పోయినట్లు తెలుస్తోందని, అందుకే మరో మూడు రోజులు పొడగించినట్లు నిర్వాహకులు చెప్పారు.
గ్రేటర్ HYDలోని ఆరు జోన్ల పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా కుక్కల జైళ్ల మాదిరి బోన్లు అందుబాటులో ఉంచారు. కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కుక్కలకు వ్యాక్సినేషన్ అందించి, వ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొన్నింటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్లో జరిగిన మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
HYD కలెక్టరేట్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తయింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి రిజర్వేషన్లు కల్పించే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన వారు, వినతి పత్రాలు సైతం అందించినట్లుగా HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.
HYDలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవాన్ని కార్తికమాసం వేళ అద్భుతంగా నిర్వహించడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.
హైదరాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
Sorry, no posts matched your criteria.