India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కిరాణా దుకాణంలో తరచుగా పాలు, ఉప్పు, బియ్యం, గోధుమ కొంటూనే ఉంటాం. ఎప్పుడైనా ఆ ప్యాకెట్లపై +F గుర్తు చూశారా..? ఈ గుర్తు ఉంటే, ఆ పదార్థాలు ఆరోగ్యానికి మంచివని FSSAI తెలిపినట్లు HYD ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. +F అంటే ఫోర్టిఫైడ్ + మినరల్స్ + విటమిన్స్ అని అర్థం. వీటి ద్వారా శరీరానికి రోజుకు కావలసిన పోషకాలు అందుతాయన్నారు.
బీసీ సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న రవీంద్ర భారతి వేదికగా బీసీ సమర భేరి కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆయన ఛాంబర్లో బీసీ సంక్షేమ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు నంద గోపాల్, నీలం ఉదయ్ నేత, రఘుపతి బృందం కలిసి సమరభేరి హాజరుకావాలని ఆహ్వానించారు. బీసీలు అందరూ ఐక్యతను చాటాలని, భారీ సంఖ్యలో సమరభేరికి హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
జనగణనలో కులగణన, BCల కోసం 50% రిజర్వేషన్లకు పార్లమెంట్ బిల్లు, క్రీమిలేయర్ తొలగింపు, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాట్లను డిమాండ్ చేస్తూ నవంబర్ 25న రవీంద్రభారతిలో BC సంక్షేమ సమరభేరిని నిర్వహిస్తున్నట్లు BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. సమరభేరికి BC కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.
హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.
హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ రూబీ పాల్గొన్నారు. ఓరుగల్లు కాకతీయుల కళా ప్రదర్శనను చూసిన ప్రొఫెసర్ మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల కళలలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమనికీర్తించారు. కాకతీయ మహారాణి రుద్రమదేవి పౌరుషంతో ప్రతి మహిళ తన గుండెలో పోరాట పటిమను నింపుకోవాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయం ప్రాంగణంలోని డిస్టెన్స్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ ఎంబీఏ (ఈవెనింగ్) 2 ఏళ్ల కోర్సు ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 30 నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించామని, పరీక్షలను అదే రోజు నుంచి నిర్వహిస్తున్నప్పటికీ, వివిధ పరీక్షా తేదీలను మార్చినట్లు వివరించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు చేస్తున్నటువంటి స్టల సేకరణపై జరిగిన ఘటన గురించి లగచర్ల గ్రామ రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారికి కలిపించిన అవగాహన,వారి డిమాండ్లను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ MP మల్లు రవి, DCC అద్యక్షులు, పరిగి MLA డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి నివేదిక అందించారు.
Sorry, no posts matched your criteria.