India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అలసత్వం వహించకుండా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.
కుక్కల బెడదతో ఓవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుంటే.. HYD శివారు, ORR పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కోతుల బెడదతో అల్లాడి పోతున్నారు. కుక్కలు, కోతుల బెడద రెండూ ఉన్నట్లు మున్సిపాలిటీ ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఘట్కేసర్, కీసర, నాగారం మేడ్చల్, పెద్దఅంబర్పేట్, గౌరెల్లి, గండిగూడ, తుక్కుగూడ, రావిర్యాల, ఆదిభట్ల, తుర్కయంజాల, రాంపల్లిలో కోతుల సంచారం పెరిగింది. మీ ప్రాంతంలో కూడ కోతుల సమస్య ఉందా?
HYD ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ఇక నుంచి వాహనాల ఆటోమేటెడ్ ఫిట్నెస్ చెకింగ్ కోసం 5-6 కేంద్రాల ఏర్పాటుపై వేగం పెంచింది. మల్కాజిగిరి, తిరుమలగిరి సహా, ఇబ్రహీంపట్నం మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం దాదాపుగా రూ.8 కోట్ల మేర వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటి వరకు 44% కులగణన సకుటుంబ సర్వే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 11,10,883 కుటుంబాల సర్వే పూర్తయినట్లు పేర్కొంది. నోడల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు సర్వే తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ప్రజలందరూ సకుటుంబ సర్వేకు సహకరించాలని, సర్వే 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అటు అధికారులను ఆదేశించింది.
HYDలో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో వాటర్ హీటర్లను అధికంగా వినియోగంతో కరెంట్ వినియోగం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నగరంలో సరాసరిగా కరెంటు వినియోగం ఏకంగా 23% పెరిగింది. సైబర్ సిటీ ఏరియాలో 33%, మేడ్చల్ పరిధిలో 31% కరెంట్ వినియోగం పెరిగినట్లు వెల్లడైంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లోను 20% కరెంటు వినియోగం పెరిగింది.
గ్రేటర్ HYDలో దాదాపుగా 9,000 KMపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇందులో సుమారు 3,000 కి.మీ బీటీ రోడ్లు, 6,000 కి.మీ పైగా సీసీ రోడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో CRMP రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం 150KM రోడ్డు నెట్వర్క్ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణంపై రీబౌండ్ హ్యామర్ టెస్ట్, CSC, తార్ డెన్సిటీ పరీక్షలు కరవయ్యాయని పలు పరిశోధనల్లో తేలింది.
HYD, RR జిల్లాలలోని దాదాపుగా 66,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణ పూర్తయింది. 5-12వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు 4,701 మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అనేక మంది విద్యార్థులకు అక్షరాలు మసకబారుతున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్లు, తదితరాలు చూడడమే కారణమని తెలిపారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, ప్లాన్ ఇంప్లిమెంటేషన్, ఫినిషింగ్పై అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరి చందన, వికాస్ రాజ్ పాల్గొన్నారు.
RR జిల్లాలో భారీ చోరీ జరిగింది. పోలీసుల ప్రకారం.. HYD శివారు శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కూతురు పెళ్లి ఉండటంతో నిన్నరాత్రి మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఇంట్లోని దాదాపు 133తులాల బంగారం, 8కిలోల వెండి, రూ.2.5లక్షల నగదు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్పల్లి CI శ్రీనివాస్ గౌడ్, నార్సింగ్ CI హరి ప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
HYDలో విషాదం నెలకొంది. ఈనెల 8న మియపూర్లో అదృశ్యమైన బాలిక(17) తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో శవమై కనిపించింది. పోలీసుల వివరాలు.. ఈనెల 8న బాలిక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అతడిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.