RangaReddy

News November 18, 2024

HYD: పసిబిడ్డకు మహిళా కానిస్టేబుల్ ఆలన

image

VKB జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం గ్రూప్-3 పరీక్ష రాసేందుకు HYDలోని శేరిలింగంపల్లికి చెందిన కృష్ణవేణి వెళ్లారు. ఆమెకు 6 నెలల బాబు ఉన్నాడు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న బషీరాబాద్ PS మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును చేరదీసి, తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. తోటి ఉద్యోగులు, ఇతరులు ఆమె దాతృత్వానికి అభినందించారు.

News November 18, 2024

BREAKING.. HYDలో ఐటీ సోదాలు

image

HYDలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్‌లోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షాద్‌నగర్‌లో భూవిక్రయం జరిపిన స్వస్తిక్ కంపెనీ.. బ్యాలన్స్ షీట్‌లో వివరాలు చూపకపోవడంతో ఈ ఐటీ సోదాలకు దారి తీసింది. ఇందులో రూ.300కోట్ల వరకు భూ విక్రయం జరిగినట్లు గుర్తించారు.

News November 18, 2024

HYD: పోలీసుల అదుపులో 12 మంది ట్రాన్స్‌జెండర్లు

image

గచ్చిబౌలి PS పరిధిలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి పరిధిలో నానక్‌రామ్‌గూడ తదితర బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందులు పెడుతున్న 12 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా తమ ప్రాంతాల్లో కూడా తరచూ ఇబ్బందులు పెడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News November 18, 2024

HYDలో రేపే ఫుట్‌బాల్ మ్యాచ్

image

హైదరాబాద్‌లో రేపు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

News November 18, 2024

HYD: ఇంటింటి సర్వే మిస్డ్ కాల్ నంబర్ పోస్టర్ ఆవిష్కరణ

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే మిస్డ్ కాల్ నంబర్ పోస్టర్‌ను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. కుటుంబ సర్వేపై నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నంబర్‌కు 7289087272 మిస్డ్ కాల్ ఇచ్చి నివృత్తి చేసుకోవడానికి నంబర్‌ని ఏర్పాటు చేశామని చెప్పారు.

News November 17, 2024

గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని ఓ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల, హయత్‌నగర్‌లోని మరో ఎడ్యుకేషనల్ అకాడెమీలో ఏర్పాటు చేసిన గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. పరీక్ష నిర్వహణ గదులను, పరీక్ష కేంద్రాలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.

News November 17, 2024

ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

image

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.

News November 17, 2024

GROUP-3 EXAM: HYDలో‌ సెంటర్ల వివరాలు

image

గ్రూప్-3 పరీక్షకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 65,361మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకావాల్సి ఉంది. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. మూడు జిల్లాల్లోనే ఏకంగా 1,67,673 మంది పోటీలో ఉండటం విశేషం. 10 AMకు పరీక్ష. గంట ముందే చేరుకోండి.

ALL THE BEST

News November 17, 2024

HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

image

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2024

HYD: సినీ ప్రముఖుల నివాసాల్లో సర్వే

image

హైదరాబాద్‌ మణికొండలో సర్వే ఫారమ్‌లను కలిగి ఉన్న ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మణికొండలోని ట్రెయిల్స్ విల్లాస్‌లో సినీ ప్రముఖులు సాయికుమార్, అలీ ఇంటికి వెళ్లి అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న సర్వేకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.