India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD, ఉమ్మడి RRలో స్థలాలు కొనాలనుకునే వారే టార్గెట్గా కొందరు ముఠాలుగా ఏర్పడి మోసం చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డు,ధ్రువపత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్నారు. స్థలం కొనే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. తాజాగా బాలాపూర్ పరిధి ఆల్మాస్గూడలో ఇలాగే ఓ స్థలాన్ని 9మంది విక్రయించి వచ్చిన డబ్బును పంచుకున్నారు.ప్లాట్ యజమాని ఎల్బీనగర్ PSలో ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని BRS తమ ఖాతాలో వేసుకుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం HYD రైజింగ్లో CM, డిప్యూటీ CM, మంత్రులు BRSపై విమర్శలు చేశారు. తాజాగా CM రేవంత్ HYDపై ట్వీట్ చేశారు. ‘ప్రజా పాలనలో HYD రైజింగ్. ఈ చారిత్రక మహానగరాన్ని విశ్వ వేదికపై వైభవంగా నిలిపే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది. నిన్న, నేడు, రేపు మా ఆలోచన, మా ఆచరణ, మా కార్యాచరణ అదే’ అని పేర్కొన్నారు.

➤గ్రేటర్లో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్
➤భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన HYD
➤నాలాల ఆక్రమణలను తొలగింపు, మూసీ ప్రక్షాళన
➤ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా
➤360 కిలోమీటర్ల పొడవున RRR
➤ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్
➤ముచ్చర్లలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ
ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు కావాలని <<14781550>>CM రేవంత్<<>> వెల్లడించారు.

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.04 కిలో మీటర్ల పొడవు, 6 లైన్లతో నూతన ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. దీనివలన పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

చేవెళ్ల మం. పరిధి ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేసింది. హైవే పక్కన కూరగాయలు అమ్మితే రూ. 10 వేల FINE విధిస్తామన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్, రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవాలని సూచించారు. ఇందుకు తగు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి ప్రాణత్యాగం పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్లో జరిగిన ధర్నాలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శ్రీకాంత చారి నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ‘జై తెలంగాణ.. జై తెలంగాణ’ అంటూ ఆయన చేసిన నినాదాలు ఉద్యమకారుల కంట నీరు తెప్పించాయి. తీవ్రగాయాలతో యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన డిసెంబర్ 3(2009)న చనిపోయారు. నేడు శ్రీకాంత చారి వర్ధంతి.

శివానగర్లో రూ.65 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని గత 2 పర్యాయాలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, అదే అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ పాల్గొన్నారు.

తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఎక్స్ ఎమ్మెల్సీ యాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలో ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను తనదైన శైలిలో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఆయనని.. ఎమ్మెల్సీ కవిత అభినందించారు. అనంతరం పార్టీ విషయాలు, ప్రజా సమస్యలను పరస్పరం చర్చించుకున్నారు.

పరువు హత్యకు గురైన కానిస్టేబుల్ నాగమణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో హయత్నగర్ పోలీసులు దహన సంస్కారాలు చేశారు. అయితే, నిందితుడు పరమేశ్పై 103(1) BNS కింద FIR నమోదు చేశారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.