India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లగచర్ల దాడి ఘటనను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్కు భద్రతను పెంచింది. కలెక్టర్పై దాడి నేపథ్యంలో పోలీస్ శాఖ అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లను కేటాయించింది. అధికారులపై దాడి ఘటన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం ఆఫీసర్లకు భద్రత పెంచేందుకు కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్లోని మయూరి మార్గ్లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.
అన్ని బాగున్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రీడా పోటీల్లో ఏకంగా దివ్యాంగులు బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటి వారెవ్వా అనిపించారు. క్రీడాకారుల పట్టుదలను చూసిన ప్రజలు సలాం కొట్టారు. ఇది కదా.. అసలైన పోటీ అంటే, అనుకున్న కల కోసం కాళ్లు లేకున్నా కడదాకా పోరాడుతామని రుజువు చేశారని వారిని అభినందించారు.
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్షిఫ్లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.
HYD ప్రజలకు MNJ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు సూచనలు చేశారు. అధిక శాతంగా ఉప్పు, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం గుట్కా, కైనిమసాలా, పాన్ నమలటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బరువు నియంత్రణలో పెట్టుకోవాలని, రెడ్ మీట్ బదులుగా చికెన్, చేపలు, గుడ్లు తీసుకోవడం మంచిదని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. సమాజం అంతా సుఖశాంతులతో ఉండాలని, ఇలాంటి పూజ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం అని తెలిపారు. కార్తీకమాసం వస్తే శివయ్య భక్తులు హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
నిన్న రాత్రి 2 గంటల సమయంలో గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద వేగంగా బైక్ నడిపిన దేవ కుమార్ స్వామి(25), వెంకన్న స్వామి(30) డివైడర్ను ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు వారి ఫోటోలను విడుదల చేశారు. మరోవైపు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన గచ్చిబౌలి పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD నగర మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతి నెల నెల పెరుగుతూ వస్తోంది. జూలై నెలలో 1.44 కోట్ల మంది ప్రయాణించగా.. ఆగస్టులో 1.45 కోట్ల మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. అది కాస్త అక్టోబర్ నాటికి 1.5 కోట్లకు దాటింది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు లాస్ట్ మైలు కనెక్టివిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్లో ఉంచాలని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కాగా, లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
500 ఏళ్ల నాటి గోల్కొండ కోటను చూడటానికి వెళితే ఆకలితో అలమటించాల్సిందే. ఎంతో ఆశతో కోటను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు అక్కడ తినడానికి ఏమీ దొరకదు. కోట లోపల కేవలం ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు. కోట చుట్టూ తిరగడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.