India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలోని ప్రస్తుత సికింద్రాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అనే పదానికి అర్థం ఆర్మీ క్యాంప్. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఉండేవారు. మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరు మీద 1806లో లష్కర్ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’ ప్రాంతంగా పేరు మార్చారని చరిత్ర చెబుతోందని చరిత్రకారులు మురళి తెలిపారు.

ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు రింగ్ రోడ్డు వద్ద ఉదయం 4:19 గంటలకు మొదటి ఆర్టీసీ బస్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్ప్రెస్ బస్సులో మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో మరో సూపర్ లగ్జరీ బస్సు సైతం అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. భువనగిరి, మోత్కూరు, తొర్రూరు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. అంబర్పేట MLA కాలేరు వెంకటేశ్తో కలిసి హరీశ్రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.

HYDలోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో డిసెంబర్ 2న సా.4 నుంచి రా.10 వరకు అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, యూసఫ్గూడ, కృష్ణానగర్, మోతీనగర్, బోరబండ, జూబ్లీహిల్స్, మైత్రివనంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. జానకమ్మ తోటలో జనరల్ పబ్లిక్ వాహనాల పార్కింగ్ కాగా సవేరా, మహమ్మద్ ఫంక్షన్ హాళ్లలో ఓన్లీ 4 వీలర్ పార్కింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.

రహదారులపై వివిధ మతాల చిహ్నాలు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడి నుంచి తరలించాలని ప్రముఖ సంఘ సేవకులు గంజి ఈశ్వర్ లింగం, టీ.రమేశ్ కోరారు. సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రహదారులపై ఆటంకాలు, ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం కమలానగర్లో ఆదివారం నిర్వహించారు. కోమటిరవి, యాదగిరిరావు, కర్రం మల్లేశం ఉన్నారు.

వాహనాలపై ఇనుప చువ్వలు తరలించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని HYD ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇటీవల కూకట్పల్లి JNTUH మార్గంలో వాహనంపై నుంచి ఇనుప చువ్వలు కింద పడ్డాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. కానీ.. వాహనంపై నుంచి ఇనుప చువ్వలు వేరే వ్యక్తులపై పడితే తీవ్ర ప్రమాదం జరిగేదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

HYDలో చొరబడ్డ మధ్యప్రదేశ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా మహిళలు, శుభకార్యాలు, ఫంక్షన్ హాళ్లు, జనసంద్రం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతోంది. అందరిలాగే లగేజీతో హాజరై అన్నీ కొట్టేస్తున్నారు. అందర్నీ ఆశీర్వదించి, భోజనాలు చేసే సమయంలో మెళ్లగా మహిళలను టార్గెట్ చేసి ఆభరణాలను సైతం ఎత్తుకెళ్తున్నారు. చివరికి పర్సనల్ పాకెట్లు సైతం ఖాళీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త..!

VKB దుద్యాల్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. లగచర్ల, పోలేపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. NOV 11న లగచర్లలో అధికారులపై జరిగిన ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.తాజాగా నోటిఫికేషన్ సైతం జారీ అయింది. దుద్యాల్ గేట్ సమీపాన ప్రభుత్వ భూమిని సైతం పరిశీలించారు.

ఇరిగేషన్ ఏఈఈ నికేశ్ కుమార్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఏసీబీ అధికారులు నికేశ్ కుమార్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం నికేశ్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కొత్త రక్తం చేరబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని, తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని మోదీ చెప్పారని అన్నారు. డిసెంబర్ 6న సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.