India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కీసర గుట్టకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కీసర గుట్ట వద్ద భక్తులు బారులు తీరారు.
హైదరాబాద్లోని ప్రధాన సర్కిళ్లలో పురుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైతన్యపురి PS పరిధిలో రాత్రి సమయంలో దారిన పోయే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న 9 మంది మహిళలను సరూర్నగర్ తహశీల్దార్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక మీదట ఇలా ప్రవర్తిస్తే రూ.2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని MRO హెచ్చరించారు.
SHARE IT
కార్తీకపౌర్ణమి సందర్భంగా HYDలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆలయాల్లో లింగాలను అందంగా అలంకరించారు. శివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కీసర, శ్రీశైలం స్వామివార్లను దర్శించుకునేందుకు వందలాది మంది నగరం నుంచి బయల్దేరుతున్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం శుక్రవారం www.braou.ac.in ఆన్లైన్లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.SHARE IT
జీహెచ్ఎంసీ పాలకమండలి గడవు 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ORR వరకు 4 గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇటీవలే మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే.. ORR లోపలి 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అధికారులు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. మరీ 2026 GHMC ఎన్నికల నాటికి మున్సిపాలిటీల విలీనం, కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతుందో వేచి చూడాలి.
HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు.దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
HYD NIMSలో త్వరలో గుండె కవాటాల భద్రత కోసం ప్రత్యేక బ్యాంక్ సిద్ధం అవుతుంది. చికిత్స సైతం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గుండె కవాటాలు వైఫల్యం చెందితే కృత్తిమ కవాటాలని ఆమర్చుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వాటిని మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె కవాటాలను సేకరించి, బ్యాంకులో భద్రపరిచి అవసరమైన వారికి అమరుస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 స్టేషన్లను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం రాజదాని పరిధిలోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్పుర, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ల పనులు మరో 8 నెలల్లో పూర్తికానున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. సైబర్ నేరానికి గురై, డబ్బు పోగొట్టుకుంటే గంటలోపు 1930, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని HYD పోలీసులు సూచించారు. డబ్బు అకౌంట్ నుంచి మాయమైన గంట లోపు ఉండే సమయాన్ని గోల్డెన్ హవర్ అంటారని తెలిపారు. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే, డబ్బులు ఫ్రీజ్ చేసి, దర్యాప్తు చేయడానికి ఎక్కు ఆస్కారం ఉంటుందన్నారు. రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువన్నారు.
HYD నగరంలో 3 హబ్ ఆస్పత్రులైన నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లో వాస్క్యులర్ ఆపరేషన్లు, డయాలసిస్ చేయనున్నారు. మొత్తం రాష్ట్రంలో 7 కేంద్రాల ఏర్పాటు కోసం రూ.32.7 కోట్లను వెచ్చించనున్నారు. HYDలోని ప్రధాన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. సెంటర్లు అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.