RangaReddy

News December 1, 2024

మేడ్చల్: స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న త్రిపుర గవర్నర్

image

మేడ్చల్‌లోని ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ 28వ స్నాతకోత్సవ వేడుకలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యలో మెరుగ్గా రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను అభినందించి డిగ్రీ పట్టాలు అందజేశారు.

News November 30, 2024

HYD: గుండెపోటుతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మృతి

image

సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ గుండెపోటుతో మృతి చెందారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి ఉద్యమం నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శిగా, అఖిల భారత రైతుసంఘం ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగి గుండె పోటుతో హఠాన్మరణంతో ఆయన అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 30, 2024

HYD: నిరసన వ్యక్తం చేసి.. వినతిపత్రం అందించిన కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్న అధికారులను కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, ఇతర బీజేపీ కార్పొరేటర్లు అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని ఉన్న సమస్యలను, మహానగరంలో ఉన్న సమస్యలను మేయర్ కి తెలియజేసి వినతి పత్రాన్ని అందజేశారు.

News November 30, 2024

15 ఏళ్ల క్రితం సెంట్రల్ జైలు‌లో ఉన్నా: KTR

image

మాజీ మంత్రి, MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

News November 30, 2024

HYDలో పెరిగిన చలి.. ఒకరి మృతి

image

HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. నగర శివారు ఏరియాలు వణికిపోతున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీలు, గ్రేటర్‌లోని RCపురంలో 11.3 ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం గమనార్హం. జనవరి-24 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. చేవెళ్ల మం. ఖానాపూర్‌కి చెందిన మల్లారెడ్డి(40) లంగర్‌హౌస్‌లో చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చలిలో బీ కేర్ ఫుల్.
SHARE IT

News November 30, 2024

HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB

image

HYDలో పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT

News November 30, 2024

HYD: ప్రజా పాలనలో 6 గ్యారెంటీల అమలు: పటేల్ రమేష్ రెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌ది కాదని రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పీఎం నాయకత్వాన్ని బలహీన పరచాలని హరీశ్‌రావు, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

News November 29, 2024

బేగంపేటలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ మీటింగ్

image

బేగంపేటలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. నేషనల్ బయోడైవర్సిటీ సమావేశం వేదికగా, పట్టణీకరణ అంశాల గూరించి విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాజకోట మేయర్ పదాదియ, తదితర నేతలు పాల్గొన్నారు.

News November 29, 2024

నాంపల్లిలో సినీ నటుడు సోనూసూద్

image

నాంపల్లిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సందడి చేశారు. ఓ ప్రముఖ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఓ దివ్యాంగ యువతి సోనూ సూద్‌కు ఆయన స్కెచ్ బహుకరించింది. దేశంలో దివ్యాంగులకు తానూ ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

News November 29, 2024

డిసెంబర్ 2న బాచుపల్లికి సీఎం రేవంత్

image

డిసెంబర్ 2న బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం భవన సముదాయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక మేయర్ నీలా గోపాల్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సభా స్థలి, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.