RangaReddy

News November 13, 2024

సీఎం రేవంత్ రెడ్డితో నెదర్లాండ్స్ రాయబారి భేటీ

image

నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలోని వారి అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి జెరార్డ్ ఆసక్తి కనబర్చారు. ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ పాల్గొన్నారు.

News November 13, 2024

HYD: బైకులు ఎత్తుకుపోతున్నారు జాగ్రత్త..!

image

HYDలో 2024లోనే దాదాపు 1,400లకు పైగా వాహనాల చోరీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతేడాది మొత్తం 1,400 చోరీల కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 1,400 దాటడం గమనార్హం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ఇంటి ముందు పార్కు చేసినవి, కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న వాహనాలను ఎత్తకెళ్తున్నారు. అయితే బైకులకు అలారమ్, సెన్సార్లు ఏర్పాటు చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
# SHARE IT

News November 13, 2024

HYD: మూసీపై MASTER ప్లానింగ్, డిజైన్లపై కసరత్తు!

image

HYD మూసీకి తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు 55KM మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నదికి ఇరువైపుల కిలోమీటర్ మేర గ్రోత్ ఏరియాగా గుర్తించారు. మొత్తంగా 125 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాణిజ్య కేంద్రాలు, రవాణా, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ జోన్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మరో నెలలో మూసీ డిజైన్లు పూర్తవుతాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

News November 12, 2024

HYD:ఇంటర్నేషనల్ లైసెన్సుల పై వాహనదారుల ఆసక్తి!

image

అంతర్జాతీయ లైసెన్సులపై వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రేటర్ HYD పరిధిలో ఈ ఏడాది ఏకంగా 10,000 వరకు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. వీటి కోసం ఆర్టీఏ వెబ్‌సైట్, లేదంటే స్థానికంగా ఉన్న కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలని, దరఖాస్తు చేసిన తేదీ నుంచి కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

News November 12, 2024

HYD: ఓవైపు కోర్టు నుంచి స్టే.. మరోవైపు 2BHK

image

HYD, RR, MDCL జిల్లాల్లో 2,166 నివాసాలు మూసీ నది గర్భంలో ఉన్నట్లు 2018 డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. వాటిలో 68% ఇళ్లకు ఇప్పటి వరకు రివర్‌బెడ్ RB-X మార్కింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చైతన్యపురి, కొత్తపేటలో దాదాపు 620 మంది పిటిషన్లు దాఖలు చేయగా.. వారిలో సుమారు 400 మందికి పైగా కోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వం కేటాయించిన 2BHKకు వెళ్తున్నారు.

News November 12, 2024

HYD: ఫోన్ల రికవరీలో తెలంగాణ TOP-2

image

HYD నగరలో క్రైమ్ రివ్యూ మీటింగ్ డీజీపీ డాక్టర్ జితేందర్ అధ్యక్షతన జరిగింది. 557 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోగొట్టుకున్న 50,788 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఫోన్లు రికవరీ చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో ర్యాంక్ సాధించిందని తెలిపారు. తెలంగాణలో సరాసరిగా రోజుకు 91 మొబైల్ ఫోన్లు రికవరీ అవుతున్నట్లు తెలిపారు.

News November 12, 2024

HYD: 15 వేల మంది విద్యార్థులతో ప్రోగ్రాం: సీఎం

image

HYDలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 15,000 మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు, పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థుల కెపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

News November 12, 2024

HYD: ఎలక్ట్రిక్ బస్సులు పెంచడంపై ఆర్టీసీ ఫోకస్

image

గ్రేటర్ HYD జోన్ పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా వాటిలో 40 పుష్పక్ బస్సులతో కలిపి దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని అందుబాటులోకి తేనుంది. కోకాపేట, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

News November 12, 2024

సికింద్రాబాద్: రైల్వే స్టేషన్లలో రద్దీ.. ఎప్పటికప్పుడు చర్యలు!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేశారు. ఛట్ పూజ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా రద్దీ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు డౌన్ ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నారు.

News November 12, 2024

సికింద్రాబాద్: రైల్ సేవల పట్ల ప్రయాణికుల హర్షం

image

సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ భారత్ గౌరవ్ ట్రైన్ సేవల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన రామేశ్వరం, తిరువన్నామలై, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.