India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.

రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ అంశాల గురించి చర్చించినట్లు వారు తెలిపారు.

వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.

HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్<<>>లో రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మణుగూరు స్పెషన్ ట్రైన్లో దారుణం జరిగింది. HYDలో ఉంటున్న కూతురుని చూసేందుకు రమణమ్మ NOV 23న బళ్లారి సమీపంలోని ఓ స్టేషన్లో రైలుఎక్కింది. 24న రైలు సికింద్రాబాద్ చేరుకుంది. స్టేషన్లో ఎదురుచూస్తున్న అల్లుడు రైలులోని బాత్రూంలో <<14716114>>అత్త మృతదేహం<<>> చూసి రైల్వే పోలీసులకు సమాచారమి చ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోహిత్ అనే వ్యక్తి హత్య చేసి రూ. 25 వేల నగదు, సెల్ఫోన్ అపహరించినట్లు గుర్తించి, అరెస్ట్ చేశారు.

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. HYD రీజియన్లో 117, ఉమ్మడి RRలో 172 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

రోడ్డు ప్రమాదాల నివారణకు HYD పోలీసులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. CYB, HYD, రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లలో నిత్యం సూచనలు చేస్తున్నారు. తాజాగా రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్పై ఫోకస్ పెట్టారు. ‘సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. బహుశ అది యముడి పిలుపు కావొచ్చు’ అని పంజాగుట్టలో ఉన్న ఓ బోర్డు ఆలోచింపజేస్తోంది. Follow Traffic Rules.
Share it

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.

నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వీ.హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.