RangaReddy

News November 12, 2024

HYD: ‘కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయండి’

image

కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ అన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే వివరాలు నింపుతున్న ఫామ్‌లో ఎస్సీ మాదిగ అని మెన్షన్ చేస్తూ, మాదిగ కోడ్ 31గా నమోదు చేసుకోవాలని తెలిపారు. కోడ్‌ను నమోదు చేయని పక్షంలో మాదిగ కులాన్ని జనాభా లెక్కలు తక్కువ చూపిస్తూ, రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

News November 12, 2024

వికారాబాద్‌లో హైటెన్షన్!

image

వికారాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక BRS హస్తం ఉందని HYD వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్ట్‌లకు నిరసనగా BRS నేతలు వికారాబాద్‌ బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

News November 12, 2024

లగచర్లలో ప్రభుత్వ తీరు అమానుషం: హరీశ్ రావు

image

వికారాబాద్ జిల్లా <<14585618>>లగచర్లలో<<>> 300 మంది పోలీసులు మోహరించి స్థానికులను అరెస్టు చేయడం దారుణమని సిద్దిపేట MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన గ్రామస్థులపై అర్ధరాత్రి పోలీసులతో దమనకాండ సరికాదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలి. వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి’ అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

News November 12, 2024

హైదరాబాద్‌కు భగత్‌ సింగ్ మేనల్లుడి రాక

image

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న హిమాయత్‌నగర్, 27 న కుత్బుల్లాపూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని AISF, AIYF, CPI ప్రకటించాయి. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్న ప్రొ. జగ్మోహన్ సింగ్ మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులతో ఇంట్రాక్ట్ అవుతారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.

News November 12, 2024

HYD: వానరానికీ శివుడే దేవుడు!

image

కార్తీకమాస సోమవారం కీసరగుట్టలో ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది.‌ శిరసా నమామి అంటూ ఓ వానరం శివయ్యను హత్తుకుంది. కీసరగుట్టలోని శివలింగానికి భక్తులు పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వానరాలు శివలింగం చుట్టూ ఆటలాడాయి. నైవేద్యంగా పెట్టిన అరటి పండు తిన్న ఓ వానరం ఆకలి తీర్చావయ్యా అని అనుకుందేమో..! నువ్వే నాకు దిక్కు అంటూ లింగాన్ని నమస్కరించింది.

News November 12, 2024

HYD‌లో తగ్గిన చికెన్‌ ధరలు!

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మొన్నటివరకు స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. నేడు స్కిన్ లెస్ రూ. 218, విత్ స్కిన్ రూ. 191కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

SHARE IT

News November 12, 2024

HYDలో సెక్షన్ 163 పరిధి కుదింపు

image

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న నుంచి HYD, SEC వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్‌) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీ‌ల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.

News November 12, 2024

HYD: మహిళలు ముందుండడం గర్వంగా ఉంది: సుమ

image

బేగంపేటలో నిర్వహించిన మహిళా ప్రోగ్రాంలో యాంకర్ సుమ పాల్గొన్నారు. సుమ మాట్లాడుతూ.. భారతదేశపు అసలైన నిధి మహిళలే అని అన్నారు. ఆర్థికంగా మహిళా శక్తి ఎదుగుతుండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. పోటీ ప్రపంచంలో మహిళలు ముందుండడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, విద్యతో ఎన్నో సాధించవచ్చన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఎంతో అవసరమని పేర్కొన్నారు.

News November 11, 2024

ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

image

ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సులువుగా అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బస్‌పాస్ ఉన్నవారు తమ బస్‌పాస్‌తో ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. జనవరి 30వ తేదీ వరకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 11, 2024

HYDలో విషాదం.. గుండెపోటుతో గుడిలో మృతి

image

HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్(31) చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందాడు. KPHB పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.