India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్చెరు, హయత్నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.
శంషాబాద్లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి ప్రకటించారు. ఏపీ గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె ఆదివారం మాట్లాడారు. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
రాజధాని వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్పూర్, జగద్గిరిగుట్ట ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. SHARE IT
శంషాబాద్లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి తెలిపారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె మాట్లాడుతూ.. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
HYDలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ కులగణన సర్వే చేస్తున్నారు. కాగా.. కొంత మంది సర్వేపై విమర్శలు చేస్తూ మహిళల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై TSPSC మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి X వేదికగా స్పందించారు. ‘వారు పార్టీ కార్యకర్తలు కాదు. వారు ఉద్యోగులు. వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. DGP చర్యలు తీసుకోవాలి. విమర్శించాలనుకుంటే డైరెక్ట్గా మీరే ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలి’ అని సూచించారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 25 వరకు సిటీలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోఠి బస్ స్టేషన్లో 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
రాజధాని వాసులకు ముఖ్య గమనిక. రేపు (నవరంబర్ 11న) నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్పేట, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్పూర్, జగద్గిరిగుట్ట పరిధి ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
SHARE IT
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు అధికారులు బూత్ స్థాయి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకుఫాం-6,అభ్యంతరాలకు ఫాం-7,సవరణలకు ఫాం-8 నింపాలి.voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.>>1950(TOLL FREE)
BRS, BJPపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈరోజు HYD నాంపల్లిలోని గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. KCR, KTR, హరీశ్ రావును అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని గతంలో బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. కానీ తాము చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. BRS, BJP ఒక్కటే అని, కులగణన, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ను హెచ్చరించారు.
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు HYD నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. NOV 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, ఏపీ పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.